Wednesday, July 31, 2013

Its Telangana



The momentous decisions by the CWC and the UPA came after hectic consultations for the last over a week on creation of the 29th state of the country that will have a geographical area of 10 of the 23 districts of undivided Andhra Pradesh.


Tuesday's decision also brings to fruition the announcement made by the then Home Minister P. Chidambaram on December 9, 2009 for creation of Telangana.

Contrary to speculation that the new state could be named Rayala Telangana, including a couple of districts of Rayalaseema, the districts that will be part of the new state will be Adilabad, Karimnagar, Khammam, Mahaboobnagar, Medak, Nalgonda, Nizamabad, Rangareddy and Warangal besides Hyderabad.

At the moment the idea is to have 10 districts in Telangana but it will be for the Group of Ministers to consider demands for inclusion of more areas, Digvijaya Singh, incharge of Andhra Pradesh affairs in Congress, told a press conference after the CWC meeting.

UPA PANEL, CWC GIVE NOD FOR TELANGANA



Highlights from the press meet addressed by Digvijaya Singh and Ajay Maken:
• CWC resolution asks the Centre to assist Andhra govt to maintain harmony in both states: Ajay Maken
• CWC recommends Hyderabad to be joint capital for 10 years
• The decision has not been easy and has been taken after widest possible consultations: CWC
• Have passed the resolution on Telangana keeping in mind the problems that Seemandhra people might face: Digvijaya Singh
• After 10 years, Seemandhra will have a new capital city in place: Digvijaya
• We have kept in mind security, water issues, liabilities.Will be considered while drafting of law: Digvijaya
• Telangana should not be compared with other regions which are demanding statehood, it has a different history: Digvijaya
• This is not due to any political reason, it was a long standing demand: Digvijaya
• 'The formation of the state (Telangana) will take about four to five months'
• LK Advani had opposed Telangana when in power, now BJP are supporting, masters of doublespeak: Digvijaya

Thursday, March 07, 2013

తెలంగాణ తండ్లాట


http://www.namasthetelangaana.com/News/article.asp?category=1&subCategory=2&ContentId=214119

తెలంగాణ తండ్లాట

telangaana

- పశ్నల పందిరి కింద ప్రత్యేక ఆకాంక్ష

-ఎప్పుడొస్తది తెలంగాణ?

-జాప్యానికి కారణం ఎవరు..

-ఉద్యమంలో ఎందుకీ స్తబ్ధత..

-జవాబు కోసం జనం అన్వేషణ
-400 బలిదానాల తొలిదశ పోరు

-వేయి ఆత్మత్యాగాలతో నేడు కత్తుల వంతెన మీద..

-ఆకాంక్షమేరకు సాగని ఉద్యమం

-జనం కదిలితే.. కలిసొచ్చే నాయకత్వం

-అందులోనూ ఓట్ల రాజకీయం

-ఎన్నికలవైపు మళ్లించే యత్నాలు

-సమిష్టి ప్రయోజనాలు పట్టని నేతలు

-అందరిదీ తెలంగాణ జెండాయేకానీ.. ఎవరి ఎజెండా వారిదే

-ఐక్యపోరాటాలే రాష్ట్ర సాధన సోపానాలు

-మొత్తుకుంటున్న తెలంగాణ జనం



ఒకటే లక్ష్యం.. రెండు ఉద్యమకాలాలు.. మూడేళ్లుగా ఎగసిపడుతున్న పోరు కెరటం.. నాలుగు కోట్ల ప్రజల హృదయ స్పందన.. ఐదు దశాబ్దాలుగా రగులుతున్న ఆకాంక్ష! ఇది తెలంగాణ తండ్లాట! స్వయం పాలనకోసం.. కోల్పోయిన ఆత్మగౌరవం సాధనకోసం.. అభివృద్ధికోసం.. దోపిడీ నుంచి విముక్తికోసం! 1969నాటి ఉద్యమ బలిదానాల నెత్తురు ఇంకనేలేదు! మా తెలంగాణ మాకు కావాలంటూ తెలంగాణ పది జిల్లాల్లో కలియదిరుగుతున్న అకుంఠిత కార్యకర్తల పాదధూళి.. పల్లె పల్లెనూ పలకరిస్తూనే ఉంది! రాష్ట్ర సాధనే తప్ప మరే స్వార్థమూ లేని వేయి మందికిపైగా మెరికల్లాంటి తెలంగాణ యువచైతన్యాలు ఆత్మాహుతితో ఉద్యమాన్ని పునీతం చేస్తే.. ఆ తల్లిదంవూడుల కంట కారిన నీరు ఇంకా ఘనీభవించనే లేదు! ఉద్యమానికి దూరంగా వనవాసంలో ఒకరు.. ఆకాంక్షలు పట్టక అజ్ఞాతంలో మరొకరు.. సమర క్షేత్రాలను వదిలేసి.. ప్రవాసానికి ఇంకొకరు! తెచ్చేది ఇచ్చేది మేమేనని ఒకరు.. తెచ్చేందుకే వచ్చామని ఒకరు.. వస్తే ఇస్తామంటూ ఒకరు! ఇచ్చినా.. ఇవ్వకున్నా మాదేముందని మరికొందరు! ఏమైతేనేం.. ఏవైతేనేం? ఒకటి రెండు మినహాయింపు.. అన్ని పార్టీల నినాదమూ తెలంగాణ సాధనే! అన్ని సంఘాల పోరాటమూ తెలంగాణ కోసమే! అయినా ఇంకా ఎందుకు రాదు తెలంగాణ? ఎందుకీ జాప్యం? కీలక మజిలీకి చేరుకున్న సమయాన.. ఉద్యమ ప్రభంజనాలు పోటెత్తాల్సిన చోట.. ఎందుకీ నిర్వేదం? లోపం ఎవరిది? దోషమెక్కడ? తెలంగాణను అడ్డుకుంటున్న మాయల మరాఠి.. సప్తసమువూదాల ఆవల మర్రిచెట్టు తొర్రలోని చిలుకలో దాచుకున్న ఆయువుపట్టును దెబ్బకొట్టే ధీరుడెవ్వడు? తెలంగాణపై కమ్ముకున్న ప్రశ్నల మబ్బులు వీడిపోయేదెన్నడు? తెలంగాణ విడిపడేదెన్నడు? సహస్ర ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నమిది!
srikanth



(టీ మీడియా, హైదరాబాద్):దశాబ్దాల ప్రశ్న ఒకటే! ఎప్పుడొస్తది తెలంగాణ? ఉద్యమం నానాటికీ విస్తరించి.. ఫోను మోగినా జై తెలంగాణ నాదం రింగురింగుమనే సమయాన.. ఒకటే సందేహం.. ఇంకా ఎందుకు రావటం లేదు తెలంగాణ? ప్రశ్న క్లిష్టమైనదే! కానీ.. జవాబు సంక్లిష్టమైనది కాదు! ఇక్కడ ఉద్యమ చైతన్యం నిత్యం ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. కానీ.. రాజకీయ చిత్తశుద్ధి లేదన్నదే జనం ఆవేదన! కాంగ్రెస్ మొదలుకుని.. టీఆర్‌ఎస్.. బీజేపీ.. టీడీపీ.. సీపీఐ.. న్యూడెమోక్షికసీ..! ఎవరి ఎజెండా వారిదే. ఉద్యమం ఆసరాగా వచ్చే ఓట్లెన్ని? ఆకాంక్ష పేరు చెప్పి వెనకేసుకునే సీట్లెన్ని? సంఘం నుంచి ఉద్యమ సోపానం ఎక్కి.. అసెంబ్లీకి వెళ్లేదెలా? మొత్తంగా ఎన్నికల దిశగా ఉద్యమాన్ని నెట్టే ప్రయత్నమే! ఢిల్లీలో ఒక కదలిక వచ్చినప్పుడో.. డీలాపడిన ఓ అమాయకుడు ప్రాణత్యాగం చేస్తేనో.. ఆగ్రహించిన జనం పోటెత్తితేనో.. అప్పుడే రాజకీయ నాయకుల్లో కదలిక! ఎవరో ఒకరు పిలుపునిస్తే.. కాలం బాగుంటే మిగిలినవాళ్లు కలిసి వస్తారు! లేదంటే కటిక నిశ్శబ్దం! ఇట్లైతే తెలంగాణ ఎట్లొస్తది? ఇది సమస్త తెలంగాణ ప్రజలు సంధిస్తున్న ప్రశ్న!



1969లో తెలంగాణ ఉద్యమం ఉప్పొంగింది. సమైక్యవాదం బూటకమేనని తొలినాళ్లలోనే తేలిపోయిన తర్వాత.. తెలంగాణం తిరగబడ్డది! మా రాష్ట్రం మాకు కావాలంటూ గొంతెత్తింది. సహించని కాంగ్రెస్ సమైక్యపాలన.. ఉద్యమాన్ని అణచివేసింది. తుపాకులు ఎక్కుపెట్టి.. రాజధాని నగరం నడిబొడ్డున 369 మంది యువకులు.. స్కూలు పిల్లలను నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేసింది! నాయకత్వానికి ‘రాజకీయం ప్రతిఫలం’ చెల్లించి కొనేసింది! ఉద్యమాన్ని బొందబెట్టింది. కొన ఊపిరితో ఉన్న ఉద్యమ ప్రాణం.. మిణుకుమిణుకుమంటూనే దశాబ్దాలుగా విస్తరించి.. నేడు మహోన్నత కాగడా అయ్యింది! కోట్ల మంది ఉద్యమశక్తులకు మార్గం చూపుతున్నది. అయితే.. ఆ మార్గాన్ని అనుసరించే క్రమంలో రాజకీయ పార్టీల మధ్య సయోధ్య కుదరడం లేదన్న విమర్శ బలంగా వినిపిస్తున్నది. రాజ్యాంగబద్ధమైన డిమాండ్‌పై సాగే ధర్మయుద్ధాన్ని మరింత బాధ్యతతో ముందుకు తీసుకు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘల నాయకత్వం.. సంకుచిత భావాలతో.. తిరోగమన దిశలో పయనించడం వల్లే ప్రస్తుతం ఉద్యమంలో స్తబ్దత ఏర్పడిందన్న విమర్శ బలంగానే వినిపిస్తున్నది. ఈ స్తబ్దతకు కారకులవుతున్నవారిపై జనం తిరుగుబాటు చేసే పరిస్థితులూ తలెత్తుతున్నాయి.



విద్యార్థులు.. వైద్యులు.. న్యాయవాదులు.. కార్మికులు.. అధ్యాపకులు.. ఒక్కరేమిటి? తెలంగాణ సాధనకు సబ్బండ వర్ణాలూ సమరశంఖం ఊదుతున్నాయి. గ్రామక్షిగామాన సంయుక్త కార్యాచరణ కమిటీలుగా ఏర్పడి.. ఉద్యమానికి బాసటగా నిలుస్తున్నాయి. మరోవైపు ఉద్యమానికి మునుపెన్నడూ లేనంత.. ఏ ఉద్యమానికీ లేనంత మేధో సంపత్తి.. మార్గనిర్దేశం చేసేందుకు ముందుకు వచ్చింది! కానీ.. ఆ బాసటను ఉపయోగించుకునే నాయకత్వం ఎక్కడ? ఆ మేధోసంపత్తి పంచే విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని.. ఆయుధాలను పదునుపెట్టుకునే సైనికుపూక్కడ? ఇది ముమ్మాటికీ నాయకత్వ వైఫల్యమేనన్నది సమస్త ప్రజలు చేస్తున్న విమర్శ! ఉద్యమం అంటూ అలజడి సృష్టించి.. అజ్ఞాతంలోకి వెళ్లేవారు కొందరైతే.. అప్పుడప్పుడూ తీవ్రమైన ప్రకటనలు చేసి.. వనవాసానికి వెళ్లిపోయే నేతలు మరికొందరు! మరికొందరు ఇవేవీ పట్టనట్లు ఏకంగా ప్రవాసానికి వెళ్లిపోతున్నారు. దీని వల్లే కేంద్రంపై తగినంత ఒత్తిడి పెరగడం లేదన్న విశ్లేషణలు ఉద్యమ మేధావుల నుంచి వినిపిస్తున్నాయి.



తెలంగాణ సాధన కోసమే పుట్టిన టీఆర్‌ఎస్.. గతంలో టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకుని.. ఇప్పటికీ తెలంగాణ ఇస్తామని నమ్మబలుకుతున్న కాంగ్రెస్.. తెలంగాణకు జై కొట్టి.. టీఆర్‌ఎస్‌కు స్నేహహస్తం అందించిన టీడీపీ.. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ప్రత్యేక రాష్ట్రం ఇస్తామంటున్న బీజేపీ.. ప్రత్యేక రాష్ట్రం ప్రకటించాల్సిందేనని పట్టుబడుతున్న సీపీఐ..న్యూడెమోక్షికసీ.. పార్టీలు ఏవైనా అంతిమంగా వాటి దృష్టి.. ఓట్లు సీట్లపైనే ఉంటున్నదన్న విమర్శ బలంగా ఉంది. ఉద్యమంలో కూడా ఈ పార్టీలు ఎవరి దోవ వారిదేనన్నట్లు వ్యవహరిస్తాయే తప్ప.. సమన్వయంతో.. సమ్మిళిత ఆకాంక్షలతో ఉద్యమాన్ని దూకిస్తున్న ఉదంతాలు లేవనే వాదన ఉంది. గడిచిన కాలంలో జరిగిన ఉప ఎన్నికలే దీనికి నిదర్శనమని పలువురు చెబుతున్నారు. గతంలోనూ రాజకీయాలే తెలంగాణ ఉద్యమానికి కారణమయ్యాయని మేధావులు గుర్తు చేస్తున్నారు. వైఎస్ తెలంగాణ ఎమ్మెల్యేల సంతకాలతో పార్టీ అధినేత్రి సోనియాకు వినతిపత్రం సమర్పించడం వెనుక.. అధికార పగ్గాలు చేప తెలంగాణను ఒక సాధనంగా భావించిన రాజకీయ అంశమే కనిపిస్తుంది.



తొమ్మిదేళ్ల అధికార దాహాన్ని తీర్చుకునేందుకు 2004లో టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ జతకట్టడానికి ప్రధాన కారణం.. నాటి టీడీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి.. తాము అధికారంలోకి రావాలన్న తపనే! ఐదేళ్లు గడిచాక.. ఎన్నికలకు ముందు టీడీపీ తెలంగాణకు జై కొట్టినా.. టీఆర్‌ఎస్‌తో కలిసి కూటమి కట్టినా.. కాంగ్రెస్‌ను అధికారం నుంచి పడదోయాలన్న తాపవూతయమే! మొత్తంగా తెలంగాణ అంశం వివిధ రాజకీయ పార్టీలకు రాజకీయ అవసరంగా మిగిలిపోయిందన్న బాధ తెలంగాణ ప్రజల్లో గూడుకట్టుకుంటున్నది. ఫలితంగానే ఆశలు పెరిగి.. అంతలోనే నిరాశ కలిగి.. చివరకు అసంతృప్తితో రగిలిన యువత.. తమను తాము దహించుకుంటున్నారు! అందమైన భవితవ్యాన్ని రాజకీయ నాయకుల ప్రకటనలకు.. ప్రేలాపనలకు.. ప్రమాణాలకు తగులబెట్టుకుంటున్నారు!



సకల తెలంగాణ శక్తులను.. సమస్త తెలంగాణ ప్రజలను ఐక్యం చేసే మహత్తర బాధ్యతను తలకెత్తుకున్న టీజేఏసీపైనా విమర్శలు లేకపోలేదు. అన్ని శక్తులను కలుపుకొనిపోయి.. అంతిమంగా ఉద్యమశక్తిని పెంచాల్సిన జేఏసీ.. ఈ క్రమంలో కొన్ని చరివూతాత్మక పిలుపులు ఇచ్చినా.. కొన్ని రాజకీయ పార్టీలకు మొగ్గు చూపుతున్నదన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. రాజకీయ పార్టీల స్వార్థ ప్రయోజనాల చక్రబంధం నుంచి టీ జేఏసీ బయటపడలేకపోతున్నదన్న ఆవేదన పలువురు కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నది. నిజానికి జేఏసీ పిలుపులకు వచ్చిన స్పందన మరే రాజకీయ పార్టీ కార్యక్షికమానికీ రాలేదు! మిలియన్ మార్చ్.. సాగరహారం.. చరివూతలో నిలిచిపోయిన సకల జనుల సమ్మె.. దేనికదే విశిష్ఠమైన ఉద్యమంగా భాసిల్లింది. ఏ పార్టీకీ టీజేఏసీ అంటకాగాల్సిన పని లేదని కుండబద్దలు కొట్టింది. కోదండరాం నాయకత్వాన్ని అంగీకరించిన తెలంగాణ పల్లెలు.. ఆయన పిలుపు అందుకునేందుకు ఇప్పుడంటే ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు! కానీ.. ఇంకా జేఏసీపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. తెలంగాణపై వైఖరి స్పష్టం చేయని చంద్రబాబును ధిక్కరించి.. టీడీపీ నుంచి బయటికి వచ్చిన నాగం జనార్దన్‌డ్డిని ఇంకా జేఏసీలోకి ఎందుకు ఆహ్వానించలేదన్నది పెద్ద ప్రశ్న! దీనికి ఎవరు అడ్డుపడుతున్నారన్నది అంతుచిక్కని సందేహం! జేఏసీ పరాధీనంలో ఉన్నదా? అనే అనుమానం!



సంఘాలదీ అదే తీరు! తెలంగాణ ఉద్యమంతో ఓ పదవి.. ఓ పలుకుబడి! 30 రోజుల్లో అసెంబ్లీకి వెళ్లడం ఎలా? ఇదా విద్యార్థుల అధ్యయనం? రాజకీయ పార్టీల తీరును విమర్శించేందుకు సిద్ధమయ్యే అనేక తెలంగాణ ప్రజా సంఘాలు టీజేఏసీ గొడుగు కిందికి ఎందుకు రావడం లేదు? తిమిరంతో సమరం అంటూ తాము ఒక ప్రమిద పాత్ర పోషిస్తున్న ప్రజాసంఘాలు.. తెలంగాణ సంఘాలు ప్రమిదలన్నీ ఒక చోట చేరి వెలుగులు చిమ్మితే అంధకారం పలాయనం చిత్తగిస్తుందన్న వాస్తవాన్ని ఎందుకు గుర్తించడం లేదు? ఇవన్నీ విమర్శలు కావు.. దిద్దుకోవాల్సిన పొరపాట్లు! తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన సమరంలో అక్షరాయుధాలు అందిస్తున్న బాధ్యతాయుతమైన పాత్రలో ఉన్న నమస్తే తెలంగాణ.. ఈ పొరపాట్లను సకల ఉద్యమశక్తుల దృష్టి తేవాలని భావించింది. తెలంగాణ జనం కోరుకుంటున్న ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఉద్యమ శక్తులను ఏకం చేయాలని సంకల్పిస్తున్నది. ఉద్యమం పట్ల మాకు అత్యంత సున్నిత భావం ఉంది.



వేయి బలిదానాల పవివూతత మా మనసులో కదలాడుతున్నది. రెట్టింపు సంఖ్యలో యువత ఒంటిపై కమిలిన లాఠీ దెబ్బల గాయాలు మా కలాలను సలుపుతున్నాయి! ఉద్యమంలో బిడ్డలను కోల్పోయిన తల్లిదంవూడులు తమ కాలుతున్న కడుపులకు భావి తెలంగాణలో గుప్పెడు మెతుకులు దొరుకుతాయన్న ఆశతో బతుకుతున్న వాస్తవ దృశ్యాలు మమ్మల్ని ఈ సాహసానికి పురికొల్పుతున్నాయి. ఆశ ఒక్కటే.. అన్ని శక్తులు కలవాలని! ఆకాంక్ష పాతదే.. ప్రత్యేక రాష్ట్రం సాకారమవ్వాలని! నాలుగు కోట్ల ప్రజల తరఫున ‘తెలంగాణ సాధన కర్తలకు’ నమస్తే తెలంగాణ చేస్తున్న వినవూమపూర్వక విజ్ఞప్తి.. కలిసి కొట్లాడుదామనే!

Sunday, January 27, 2013

ఊసరవెల్లికి మిన్న ఉండవల్లి

http://www.namasthetelangaana.com/Editpage/columnists/Allam-Narayana.asp?ContentId=199468

undavalliఉండవల్లి అరుణ్‌కుమార్‌ను ఊసర అన్నారు. ఊసర నయం విషం చిమ్మే ఊసర కూడా అన్నారు. మాట నిలకడలేనందువల్ల మరేమైనా అనొచ్చు. మమ్మల్ని రజాకార్లు, ఖాసిం రజ్వీ అంటావా! నువ్వు ‘పెద్దాపురం వేశ్య’వి అన్నాడు పొన్నం ప్రభాకర్.

(ఈ మాటతో నాకు తీవ్ర అభ్యంతరం వుంది. వేశ్యలను కించపరచడం మరో రకమైన అల్పత్వం కనుకనే) అయినా ఇవేవీ ఉండవల్లిని వర్ణించడానికి సరిపోవు. రంగస్థల నటుడు అనేది చిన్నమాట. సోనియాగాంధీ కరీంనగర్ సభలో తెలంగాణ ప్రజల మనోభావాలు తెలుసు అని మాట్లాడిన దుబాసీ మాటల నుంచి, రెండు రాష్ట్రాలు ఎందుకు ఉండకూడదన్న వాదన నుంచి, చివరికి కేంద్రంలో షిండే గడువు, తెలంగాణపై ప్రకటన వస్తుందన్నప్పుడు, రాజమంవూడిలో ముందు ‘జై ఆంధ్ర’ సదస్సుపెట్టి, ఆనక రెండొద్దుల్లోనే గడువు వాయిదా వేసి సాక్షాత్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు పదహారోసారి దోఖా ఇచ్చిన తర్వాత ‘జై ఆంధ్రవూపదేశ్’ సభగా మార్చుకునేదాకా ఆయన ఊసర కన్నా ఎక్కువగా వేగవంతంగా రంగులు మార్చింది నిజమే. దానికాయన అర్హుడే. సరే! ఉన్న సమైక్యాంధ్ర కోసం జై ఆంధ్రవూపదేశ్ సభపెట్టి ఒక్క తెలంగాణ ప్రతినిధీ లేని సభలో, చివరకు తెలంగాణతో సహా ఆంధ్రవూపదేశ్ అంతటికీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న బొత్స సత్యనారాయణను కూడా పూర్తిగా ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షుడిని చేసి, తెలంగాణ మీద, ఉద్యమంమీద, నాయకత్వంమీద, ప్రత్యేకంగా కేసీఆర్ మీద విషం కక్కినందువల్ల ఆయన విష ఊసర అనడమూ నిజమే. (బొత్స కూడా లక్షణాలు మార్చి ఉన్నందున ఆయన చరిత వేరేగా చెప్పుకోవాలి. ఆయన రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమి? అనిమాటమార్చి సమైక్యాంవూధకు డప్పుకొట్టిన వైనం వెనుక కూడా తెలంగాణ అనివార్య సంకేతాలు ఉన్నాయి. అదే వేరే విష యం.) కానీ, ఇది ఉత్త విమర్శే అవుతుంది. తలుపుచెక్క, తమలపాకు శాస్త్రం అవుతుంది. ఉండవల్లి మాటలన్నింటిలోనూ, ఆయన సభ రెండు రోజుల ముందర, ఆ తర్వాత జరిగిన నాటికి మారిన ఎజెండాలోనూ, ఢిల్లీ లాబీయింగ్ నేపథ్యం ఉన్నది. అక్కడ వేగవంతంగా జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యమూ ఉంది. వేగవంతంగా తలకాయలు మార్చినంత సులభంగా మాటమార్చిన సోనియాగాంధీ ముఠా మడత నాలుకల సారాంశంలో ‘దాల్‌మే కుచ్ కాలా హై’ అన్న సందేహాస్పద ప్రవర్తనా ఉన్నది. ఇది రెండు సందర్భాల్లోనే జరిగింది. అందుకే ఈ సందర్భంలో ఉండవల్లి ఊసర మించినవాడు. అతను కక్కిన విషం శాశ్వతంగా తెలంగాణను అడ్డుకునే ప్రణాళికతో కూడుకున్నది. ఆడిన ప్రతి అబద్ధానికీ ఒక లక్ష్యమూ ఉన్నది. చివరగా జై ఆంధ్రవూపదేశ్ సభ తేల్చిన తెలంగాణ రాదు అన్న సారాంశం ఉన్నది. అది అత్యంత ప్రమాదకరమైనది.

ఉండవల్లి మాటలకేమి? ఆయన మాట్లాడిన తీరు తెలంగాణలో ప్రతివాళ్ల నెత్తురు మరిగించిందీ నిజమే. ఉండవల్లి ఆడిన అబద్ధాలు తెలంగాణ ప్రతి గుండెకూ ములుకుల్లా తాకిందీ నిజమే. తెలంగాణ ఉద్యమాన్ని చేసిన అవహేళనా ‘ఏందిది ఇంత అహంకారమా?’ అని తల్లడిల్లజేసిందీ నిజమే. కానీ ఉత్త మాటలకేం గానీ ఉండవల్లి ఆడిన అసత్యాలన్నింటిలో, ఒక అబద్ధపు తీర్పు అది పరమ క్రూరమైంది. పరమ పరిహాసమైంది. అవును రాష్ట్రం విభజన జరగదు. మేము నూటా డ్బ్భై ఐదు మందిమి ఉన్నాం. మీరు నూటా పందొమ్మిది మంది ఉన్నారు. అసెంబ్లీలో తీర్మానం చెయ్యకుండా విభజన జరగదు. ఈ రాష్ట్రం ఆంధ్రవూపదేశ్‌గానే ఉంటుంది శాశ్వతంగా అన్నాడాయన.

అదీ ప్రమాదకరమైనది. ఈ దేశంలో రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాత, భవిష్యత్ దార్శనికుడు, భాషా ప్రయుక్త రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, ద్విభాషా రాష్ట్రాల్లో భాషా మెజారిటీ ఉన్మాదం గురించి ఊహించినవాడూ అయిన అంబేద్కర్ ఒక పరిష్కారంగా చూపిన ఆర్టికల్ 3 నీ ఉండవల్లి అవమానించారు. సారాంశంలో తెలంగాణ ఉద్యమం ఏ స్ఫూర్తితో అయితే, ఏ ఆర్టికల్ 3 రాజ్యాంగ స్ఫూర్తితో అయితే పోరాడుతున్నదో ఆ స్ఫూర్తిని దెబ్బతీసి మొత్తంగా ఉద్యమాన్నే దెబ్బతీయడానికి కుట్రపన్నాడు ఉండవల్లి. అదీ ప్రమాదకరం. ఆయన జై ఆంధ్రవూపదేశ్ సభ లక్ష్యం అదీ. ఒక్క కిరణ్‌కుమార్‌డ్డి తప్ప ఆంధ్ర ప్రతినిధులందరూ, గద్దలు, పెద్దలందరూ హాజరయిన ఈ సభ తెలంగాణ ప్రజాస్వామ్య స్ఫూర్తినీ, అహింసాయుత మార్గాన్నీ, రాజ్యాంగ స్ఫూర్తినీ దెబ్బకొట్టడానికి ఉద్దేశించింది. ఆయనొక మాటంటే, మనమో మాట అనడం సులభం. కానీ ఉద్యమ మూలాలను దెబ్బకొట్టే ప్రయత్నం చేసినవాడు ఉండవల్లి. మనం ఊరికే వాడే ఊసర పదాలు ఆయన. ఈ చర్యకు సరిపోవు.
ఉండవల్లి ఒక DEMAGOGY (డెమగాగీ) డంబాచారి. వాగాడంబరుడు. ఉద్దేశ్యిత, ప్రేరిత లక్ష్యాలతో అబద్ధాలను ప్రయోగించినవాడు. బ్రౌన్ నిఘంటువు ప్రకారమే అయితే, డెమగాగీ అంటే ‘కలహండ్ల మొనగాడు.. కలహము పెట్టి. పదిమందిని ఎత్తివిడిచేవాడు’..

తెలంగాణ మలి ఉద్యమం ముందంజలో పరిణితి చెందింది. అధ్యయనం, ఆచరణ జమిలిగా సాగిన ఉద్యమం. తెలంగాణ బౌద్ధిక ప్రపంచం మున్నెన్నడూలేని తీవ్ర అభినివేషం ప్రకటించి మూలాలను అన్వేషించింది. వలస ఆధిపత్యం స్వాతంవూత్యానంతరం జరిగిన పరిణామాల్లో భాషా పెత్తనం, సంస్కృతీ ఆధిపత్యం నెలకొల్పుకోవడానికి, స్థిరపరుచుకోవడానికి, వలసలో జనబాహుళ్యాన్ని బానిసలుగా చేసుకొని శాశ్వత అధికారాన్ని నెలకొల్పుకోవడానికి, రెండు పద్ధతులు పాటిస్తూ వస్తున్నాయి. ఒకటి క్రూర పద్ధతి. పాలన, అధికారాలతో హింసతోనో, అణచివేత. మరొకటి గుంభనంగా, పట్టువస్త్రంలో దాచి పొడిచే పచ్చల పిడిబాకు గాయంలా ఉండేది. అది వలస ప్రాంతపు భూమి పుత్రులను, ప్రజలను గాయపరుస్తుంది. వాళ్ల దేవుళ్లను వెక్కిరిస్తుంది. వాళ్ల చరివూతను వెక్కిరిస్తుంది. వాళ్ల భూభాగాన్ని వెక్కిరిస్తుంది. భాషను వెక్కిరిస్తుంది. సంస్కృతిని వెక్కిరిస్తుంది. ఇవన్నీ అభివృద్ధి చెందిన సమాజాల ముందు ఆటవికాలుగా తీర్పులిస్తుంది. ఇది ప్రమాదకరమైనది. తెలంగాణలో వలసాధిపత్యం ఈ రెండూ అమలు పరుస్తున్నది. తాజా కలం. జేఏసీ తలపెట్టిన దీక్షకు పోలీసు అనుమతి ఉండదు.

జై ఆంధ్రవూపదేశ్‌కు ఎర్ర తివాచీ ఉంటుంది. ఎక్కడి వాళ్లనో తెచ్చి హైదరాబాద్‌లో కాపలాతో సభ నిర్వహిస్తే కాపలా కాస్తుంది. ప్రతిపక్షమే అయినా, పరస్పరం శత్రువులే అయినా చంద్రబాబు, విజయమ్మ యాత్రలకు పోలీసు బలగాలనూ, సర్వ యంత్రాంగాన్నీ వినియోగిస్తుంది. ఆ యాత్రలను నిరసించిన విద్యార్థుల వీపు పగలగొట్టి రౌడీ షీట్లు తెరుస్తుంది. ఉండవల్లి అరుణ్‌కుమార్ అందుకే ఇక్కడి నుంచి వెళ్ళినారని ఆయన చెప్పిన బ్రాహ్మణులనూ వదలకుండా, తెలంగాణ భౌగోళిక ప్రాంతం ఓ ఎత్తున ఉన్నదని ఆవేశంగా, ఎకసక్కెం చేస్తాడు, మీరు ఆనకట్టను కట్టుకోంగ వద్దన్నమా? అని హేళన చేస్తాడు. కానీ ఇవన్నీ సమైక్యవాదం సన్నగిల్లిన తరుణాన రెచ్చగొట్టడానికి, అక్కడ లేని సమైక్యవాదాన్ని రగిలించడానికి విషం కక్కుతాడు. అబద్ధాలు ఆడతాడు. అభినయం చేస్తాడు. అచ్చు జింగోయిస్టు లాగా, ఒక కుహనా దేశభక్తిని గానీ, ప్రాంతీయ భక్తిని గానీ రెచ్చగొ మాట్లాడుతాడు. అందుకే ఉండవల్లి ఊసర మాత్రమే కాదు. ఆయన జై ఆంధ్రవూపదేశ్ సభ ద్వారా ప్రజాస్వామ్య, రాజ్యాంగ స్ఫూర్తితో జరుగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని రెచ్చగొడుతున్నాడు. దాని పరిణామాలు కావాలి. ఆయనకు దాని పర్యవసానాలు కావాలి. ఆయనకు మరోవైపు వలసాధిపత్యపు మెత్తని కత్తి అవతారం ఎత్తి తెలంగాణ భూమి పుత్రులను న్యూనపరచడమే ఆయన లక్ష్యం. అది ప్రమాదకరమైనది. బ్రూట్ మెజారిటీ ఉన్నది. ఆర్టికల్ 3 చెప్పాల్సిన చోట అద్వానీని అడ్డంపెట్టుకుంటాడు. ఆర్టికల్ 3 ఉన్నదనే విషయం తెలియక కాదు. నిజానికి ఉండవల్లికి ఆయన చెప్పిన అబద్ధాలన్నింటి గురించి తెలుసు. కానీ ఇవ్వాల్టి అవసరం వేరుగా ఉంది.

తెలంగాణ ఉద్యమం రెండు సందర్భాల్లోనే ఇది జరిగింది. డిసెంబర్ 9 ప్రకటన వచ్చినాక ఇది జరిగింది. ఇప్పుడు కూడా అంతే ఎవరూ అడగకున్నా, ఎంపీల ఒత్తిడి లేదా ఎఫ్‌డీఐల కోసం ఎంపీల అవసరం ఏర్పడిన షిండే అఖిల పక్షం ప్రకటించాడు. ఆఅఖిలపక్షం అయినాక ఆయనే స్వయంగా గడువు విధించడం, ఆ గడువులోపు తెలంగాణ వస్తుందేమొ అన్న స్థాయిలో కేంద్ర మంత్రులు, సీమాంధ్ర పెట్టుబడిదారులు గులామ్‌లు, పటేల్‌లు, రవిలు కూడా తేడాగా మాట్లాడడం, అన్నింటి కన్నా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇవ్వక తప్పని ఒక అనివార్య పరిస్థితి ఏర్పడడం లాంటి సంకేతాలతో సీమాంధ్ర నాయకత్వం బెంబేపూత్తింది.

డిసెంబర్ 9 సందర్భంలో అప్పటి దాకా తెలంగాణ ఉద్యమం తెలుగుదేశంతో సహా అన్ని పార్టీలకూ, కాంగ్రెస్ నాయకత్వానికి, రోశయ్యకు కూడా న్యాయబద్ధమైనదిగా కనబడింది అప్పుడు కూడా అన్ని పార్టీలు తెలంగాణ బిల్లు కోసం పట్టుబట్టారు. ఇదేదో తేలాల్చిన సమస్యగానే కనపడింది. చివరికి చంద్రబాబు మీరు అసెంబ్లీలో తీర్మానం పెట్టండి అనే దాకా వెళ్లింది. సీమాంధ్ర మీడియాకు కూడా తెలంగాణ డిసెంబర్ 9 కి ముందు ముద్దుగానే కనపడింది. అన్యాయమైపోయిన ప్రాంతంగానే కనబడింది. తెలంగాణ ఉద్యమం నడుపుతున్న నాయకులందరూ రాక్షసుల్లా కాక మామూలు చీమూ నెత్తురు కొంచెం ఎక్కువగానే ఉన్న నాయకులుగానే కనబడ్డారు. కానీ చిదంబరం డిసెంబర్ 9 ప్రకటనతో సర్వం మారిపోయింది. ఆంధ్రోళ్ల ప్రపంచం తలక్షికిందులయ్యింది.

తెలంగాణ ఇవ్వరన్న అంచనాలతో డాంబికాలు పలికిన వాళ్లు, ఒకరిని మించి మరొకరు తెలంగాణ ఓటు బ్యాంకు కోసం ఎనలేని ప్రేమలు కురిపించిన వాళ్లు. తెల్లారేసరికి అందరూ కుమ్మక్కు అయ్యారు. వలసాధిపత్యం జడలు విప్పింది. తేడాలేదు. ఒకటే విద్వేషపు ముఖం. తెలంగాణ రక్త మాంసాలు పీల్చిన ముఖాలు. సీమాంధ్ర పెట్టుబడిదారుల తత్వమే. ఆప్రాంతపు రాజకీయ విశ్వాసాల పునాది అయింది. విలువ అయింది. వాళ్ల కోసం అక్కడ ఉద్యమం, పెంపునకు విద్వేషం కొన్ని అబద్ధాలు అనివార్యంగా తయారయ్యాయి. ఆ ఉద్యమం వంద అబద్ధాల మీద ప్రారంభం అయింది.
లోక్‌సభకు ఎన్నికైన అత్యంత సంపన్నుడు లగడపాటి రాజగోపాల్ (జగన్ ఆస్తులు ప్రకటించక ముందు), నంబర్ వన్ కాంట్రాక్టర్ కావూరి సాంబశివరావు, రాజకీయనేతగా మారిన వ్యాపారవేత్త టీజీ వెంక ఫ్యాక్షన్ చరిత్ర కలిగిన జేసీ దివాకర్‌డ్డి, తులసిడ్డి, ఆంధ్ర ఉద్యమ సంఘ మేధావిగా చెప్పుకునే చలసాని శ్రీనివాస్, అంబటి రాంబాబు లాంటివాళ్లు పత్రికల్లో, టెలివిజన్ ఛానళ్లలో ఆంధ్రవూపదేశ్ చరిత్ర గురించి, తెలంగాణ గురించి, రాజ్యాంగం గురించి, హైదరాబాద్‌ను అభివృద్ధి చెయ్యడం గురించి, తెలంగాణ వాళ్లకు వంట రాదనటం దగ్గర్నుంచి అన్ని వాదనలూ వందలాది అబద్ధాలతో వివరించారు. పెట్టుబడిదారులు, అధికా రం, అబద్ధాలు, దుర్బేధ్యమైన అజ్ఞానం, వక్రీకరణలు, సందర్భరహిత వ్యాఖ్యానా లు, విషయాన్ని పూర్తిగా తమకు అనుకూలంగా మలుచుకొని సమాచార భంగం చెయ్యడం లాంటివి ఆంధ్రవూపదేశ్‌ను హోరెత్తించాయి. ఈ అబద్ధాలను పదే పదే ప్రచారం చెయ్యడానికి సీమాంధ్ర మీడియా సంస్థలు తీవ్ర ఉత్సాహాన్ని ప్రదర్శించాయి.

జయశంకర్ సార్ సూత్రీకరించిన పాలకులు, వారిని ప్రభావితం చేసే సంపన్న వర్గాలు, తానాతందానా అనే మీడియా దుమ్మురేపింది. ఇదంతా తెలంగాణ ప్రకటన వెనక్కు తీసుకున్నాక, శ్రీకృష్ణ కమిటీ వేసేదాకా జరిగింది. ఆ తర్వాత గప్‌చుప్. సమైక్యాంధ్ర అన్నవాడు లేడు. ఉన్నవాడు లేడు. పనిబడా జేఏసీలు పెట్టినవాళ్లు మరుగైపోయారు. రికామీగా ఉన్న పరకాల ప్రభాకర్ లాంటి వారు నూటొ క్క అబద్ధాలతో ఉల్టా బనాయింపులతో తెలంగాణ మీద వ్యతిరేకత పెంచుకున్నారు. ఆయనకు కాలం కలిసిరాక సరిగ్గా సీమాంధ్ర పెట్టుబడిదారుల, కేవీపీ లాంటి దురహంకారులతో కూడి ఢిల్లీలో మమ అనిపించుకుని ఒక పుస్తకం విడుదల చేయగలిగాడు. ఆయనతో పెద్ద ప్రమాదం లేదు. ఆ రాతలు ప్రమాదకరమైనవే.
ఆత్మలేని ఆ అధికార మహాసౌధాల స్తంభాల చుట్టూ జీవితాంతం ఆత్మను కోల్పోయి తిరుగాడిన సంజయ్‌బారు చివరికి ప్రభాకర్‌కు ఊతమయ్యారు. ఆయన మనసు, ఆత్మ వేరు వేరు చేసి కోల్పోయిన లేని స్పృహతో చెప్పిన మాటలను మీడియా బంగారంగా భావించి అచ్చోసింది కానీ ప్రభాకర్ పుస్తకానికి, సంజయ్‌బారు శల్య సారథ్యపు భావ దారివూద్యానికీ ఎర్రని ఏగాణి విలువలేదు. అధికార పీఠాలను పట్టుకొని వేలాడిన వాళ్లను తెలంగాణ బౌద్ధిక ప్రపంచం మూలాల్లోనే తిరస్కరిస్తుంది. అది చాలు. అదిగో అట్లా చల్లారిన సమైక్యాంధ్ర కోసం మళ్లీ ఒకసారి తెలంగాణ కనబడగానే మళ్లీ లేపి నిలబెట్టడానికి, చచ్చిన శవాన్ని బతికించడానికి, పుచ్చిన కట్టెతో ధ్వజస్తంభం నిలబెట్టడానికి చేస్తున్న ప్రమాదకర తుది ప్రయత్నమే ఉండవల్లి చేసిన ప్రయత్నం.

తెలంగాణ రాకుండా ఉంటే.. తెలంగాణ కనుచూపు మేరలో లేకపోతే, తెలంగా ణ భూతం రాష్ట్రాన్ని ఆవహించకపోతే వీళ్లందరూ హైదరాబాద్‌నూ, తెలంగాణను దోచుకోవడంలో బిజీగా గడిపేవాళ్లు. ఈ అంతర్జాతీయ పెట్టుబడిదోపిడీ దొంగలు ఇవ్వాళ్ల కక్కుతున్న విషానికి, ముసుగు వీరుడే ఉండవల్లి.
ఆయన మెజారిటీ గురించి మాట్లాడి, మాటమార్చి మాతో చర్చలకు రావాలంటాడు. మీరట్లా మాట్లాడితే మెజారిటీగా ఉన్నవాళ్లం రాష్ట్రం ఎట్లా వస్తుందంటాడు. అంతటితో పోకుండా, స్వభావంలోనే మొట్టమొదటిసారి ‘మేము వేరు మీరు అల్పులు మీరు వేరు. చాతగాని వాళ్లు. మీ భూములు పనికిరావు, మీ జాగలు పనికిరాదు’ అని న్యూనపరుస్తూ రెచ్చగొడ్తాడు. ఇదీ ప్రమాదం. అందుకే ఉండవల్లి లక్ష్యం పెద్దది. ఊసర స్థాయికి మించింది. ఉద్వేగాలను, విద్వేషాలనూ రెచ్చగొట్టి, సీమాంధ్ర ప్రజల్లో లేని, భావోద్వేగాలను రెచ్చగొట్టి, శాశ్వతంగా తెలంగాణ రాకుండా చెయ్యడమనే కుట్రలో భాగంగానే ఇది జరుగుతున్నది. అందుకే ఆయన డెమగాగీ... తెలంగాణలో జరిగిన ఆత్మహత్యలకు బాధ్యుడైన వాడే ఆ శవాల మీద అబద్ధాలు నిర్మిస్తాడు. అదీ విషాదం.

రెండంశాలు మాట్లాడాడు ఉండవల్లి. అతి కీలకమయింది విలీనం బలవంతంగా జరిగింది అన్న అంశాన్ని విభేదిస్తూ అబద్ధాలాడడం. విలీనం కోసం ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడూ అంగలార్చలేదని, ఇది బలవంతపు విలీనం కాదని, తెలంగాణవాళ్లు కోరుకుం విలీనం అయ్యిందని అతిపెద్ద అబద్ధం అడారాయన. అందుకు సరోజినీనాయుడు కుమారుడు, ఎంపీ జయసూర్యను అరువు తెచ్చుకుని ఆయన ప్రసంగాలను ఉటంకించారు. మధ్యలో ఒక పత్రం చదువుతూ మిగతా విషయాలు మనకెందుకు? అని ఆయనకు ఆయనే సర్దిచెప్పుకున్నాడు కూడా. అంతే విలీనం బలవంతంగా జరగలేదనడానికి వీలైన పత్రాలు మాత్రమే చదివి, ఇదంతా బూటకం అని ఏకపక్షంగా తీర్మానించాడు ఉండవల్లి. అది నిజం కాదని ఒక లక్షసార్లు నిరూపణ చేశారు తెలంగాణవాదులు.

1955 నవంబర్ 25న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి బెజవాడ గోపాలడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీ ఆమోదించిన ఏకక్షిగీవ తీర్మానం మొదలుకొని, అప్పటి ఉపముఖ్యమంత్రి ఫిబ్రవరి 1న చేసిన విజ్ఞాపనల దాకా, తెలంగాణ ప్రజలకు తగిన రక్షణలుంటాయి, వారి హక్కులు చట్టపరంగా గ్యారంటీలుంటాయి. లాంటి మాటలు, అయ్యదేవర కాళేశ్వరరావు లాంటి వాళ్ల మాటలు, విశాలాంధ్ర ఇప్పుడు కాకపోతే ఎపుపడూ ఏర్పడదన్న వాస్తవం, ఆంధ్ర ఆర్థికాదాయాలు, తెలంగాణ ఆదాయం (ఆబ్కారీ, భూమిశిస్తు) ఎక్కువన్న అభివూపాయాలు, కరువు కాలాల్లో కూడా తెలంగాణలో ఖర్చుకన్నా ఆదాయం ఎక్కువ ఉన్న పరిస్థితులు లాంటి వాటి చర్యలను, ఆ విషయాలను సౌలభ్యం కోసం విస్మరించి ఉండవల్లి తనకు కావల్సిన సమాచారాన్ని వాడుకున్నారు. (విషాదమేమంటే అదే సభలో ఒక చిన్న చిట్టీ వచ్చింది. ప్రేక్షకులు పంపిన జాబు. ఆ తర్వాత ఉండవల్లి సరోజినీ నాయుడు అంటే ఎవరు అని వివరించారు) అదీ అక్కడ చేరిన వారి స్థాయి. ఈ రక్షణలు ఎందుకవసరమైనవో తెలిస్తే ఉండవల్లి ఎంత పెద్ద అబద్ధం ఆడాడో అవగతం అవుతుంది. గోవింద్ వల్లభ్‌పంత్ సమక్షంలో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందంలో కాలపరిమితిలేని చట్టరక్షణలు దానిద్వారా ఒప్పందం జరిగింది. కానీ ఆ తర్వాత ఈ రక్షణలు, ఒప్పందాల ఉల్లంఘనలు మరుసటిరోజు నుంచే జరిగాయి. దానిపైన పార్లమెంటు సభల్లో రజ్‌బహదూర్‌గౌర్, గులాం పంజాతన్, వి.కె.ధగ్, హరిశ్చంద్ర హెడా లాంటి ఎంపీలు అనేకసార్లు చర్చ పెట్టారు. దామోదరం సంజీవయ్య రక్షణల ఉల్లంఘనను స్వయంగా అంగీకరించారు. ఇదంతా విస్మరించిన చరిత్ర కాదు. ఇటీవలిదే. కానీ ఉండవల్లి అబద్ధాలు ఈ అంశంలోనే ఇతర సమాచారం మీద నిజాలంత స్థాయిలో నిర్మితమయ్యాయి. బూర్గుల రామకృష్ణారావు విలీనం కోరడం గురించి చెప్పి, ఆ తర్వాతి పరిణామాలు ఎత్తుకోకపోవడం. నిజానికి తెలంగాణ వేరు రాష్ట్రంగానే ఉండాలన్న బూర్గుల అనంతర కాలంలో ఏఏ ప్రలోభాలకు లొంగారో, ఏ ఏ భయాలకు లొంగారో? అవన్నీ వివరమైన చర్చ జరిగే ఉన్నది. ఆయన తర్వాత కేరళ గవర్నర్ కూడా కావడం అప్పటి సంగతులకు నిదర్శన సత్యం కూడా. అదీ ఉపయోగించుకుని విలీనం కోరుకుంటే అయిందని ఉండవల్లి విషం కక్కారు.

నీటి ప్రాజెక్టుల సంగతి ఉండవల్లి చెప్పిన కొత్త సత్యాలేవీ లేవు. గ్రావిటీ నీరు, పల్లమెరిగే నీరు, తెలంగాణ లక్షలసార్లు చర్చించింది. నాగార్జునసాగర్, నిజాంసాగర్, డిండి, కోయిల్‌సాగర్, వైరా, పాలేర్, మున్నేర్, మూసీ లాంటి ప్రాజెక్టుల కింద ఆంధ్ర రైతులు ముసిరినప్పటికీ, ఈ ప్రాజెక్టులు ఎందుకు ఆలస్యమయ్యాయో? అందరికీ తెలుసు. వరదకాలువ దుస్థితి, ఇతర ప్రాజెక్టుల దుస్థితి, చెరువుల విధ్వం సం, చివరికి మృగతృష్ణ లాంటి దేవాదుల ప్రాజెక్టును చూపి తెలంగాణ అక్కరకు రాని భూమి అని తేల్చిన ఉండవల్లి చర్చకు నిలవలేడు.

నందికొండ ప్రాజెక్టు నాగార్జునసాగర్ కావడం, ఎడమ కాలువ కుదించుకుపోవడం, శ్రీశైలం ఎడమ కాలువ ఒక ఫార్సు కావడం, ఇప్పటి ఆల్మట్టి, అప్పటి సొరంగమార్గాన్ని ఆంధ్ర తిమింగలాలు ఎత్తుకుపోవడం ఇట్లా కోకొల్లలు. నీటి వినియోగం లెక్కలు, నదీ పరీవాహక ప్రాంతం, కేటాయించిన నీళ్లు, వాస్తవంగా తీసుకుంటున్న నీళ్ల లెక్కలు టీఎంసీలతో సహా ఉంటాయి. ఏ చిన్న పిల్లవాడైనా ఈ విషయాల మీద ఉండవల్లికి పాఠం చెప్పగలడు. ఇవీన్న అంగీకరించిన సత్యాలు. నీటి పారుదల విలీనం తర్వాత పెరగడానికి, ఆయనే ఉటంకించిన కరెంట్ వినియోగానికి ఒకే జవాబు, చెరువులు ధ్వంసం అయిన, ప్రాజెక్టులు రాక, శ్రీరాంసాగర్ నుంచి ధవళేశ్వరం దాకా ఒక్క ఆనకట్టా లేక (ఇచ్చంపల్లిని కుట్ర పూరితంగా కాకుండా చేశారు) భూగర్భ జలాలను పాతా ళం నుంచి తోడి వ్యవసాయం చేసి భగీరథ ప్రయత్నంతో సాగును పెంచుకున్నది తెలంగాణ. కాళ్లతో కాల్వలు మళ్లించుకునే మీ గోదావరి, కృష్ణా డెల్టాలకన్నా, బోరు పొక్కలు తవ్వి, కరెంటు మోటార్లతో కనాకష్టంగా పంటతీసి వరి ధాన్యాగారం అయింది కరీంనగర్. అదీ వ్యవసాయమంటే సహజంగానే ఈ కడగొట్టు కఠిన వ్యవసాయంతో ఆత్మహత్యలూ పెరిగాయి. అందుకే కరెంటు సగటు వినియోగమూ పెరిగింది. ఈ వాస్తవం ఆయనకు తెలియకకాదు మనల్ని, మన భూమిని హేళన చేసి మరిగింపజేయాలి అదీ లక్ష్యం.
ఇక తెలంగాణ ఉద్యమం మీద, ఉద్యమ నాయకత్వం మీద ప్రధానంగా కేసీఆర్ మీద, కొంచెం కోదండరాం మీద ఉండవల్లి దాడి ఎక్కుపెట్టాడు. బ్రిటిషాంవూధలో బలిసిన ఈ పెద్దమనుషులు లౌక్యం, బతకనేర్చినతనం, వ్యవహార జ్ఞానం, బతకడానికి ఎంత మోసపు పద్ధతులైనా అవలంబించే కపటత్వం మెండుగా చేసుకునే ఆధునిక గిరీశాలు.

కడుపు నిండిన వాడు గుంభనంగా మాట్లాడతాడు. మోసంతో మాట్లాడతాడు. పెదాల మీంచి మాట్లాడతాడు. తేనె పూసిన కత్తిలా ఉంటాడు. కడుపులో కత్తులు దాచుకొని కావలిచ్చుకుంటాడు. అదీ తరహా. కానీ వాస్తవాలు తెలిసి ఉద్యమం మీద స్పష్టమైన అవగాహన ఉండీ, మోసాల మీద, కడుపుమాడి రాజకీయ యవనిక మీద జరిగే కుట్రలూ, కుతంవూతాలు తెలిసీ, మనుషులు రాలిపోతుం కూడా మర్యాదగా మాట్లాడం ఇక్కడి ఉద్యమకారులకు ఎట్లా చాతనవుతుంది. ‘ఉల్టాచోర్ తారుమారు మాటలకు ఎవరైనా ఒకే భాష మాట్లాడతారు. అది అప్పటికే. తెలంగాణనకు అడ్డొస్తే అడ్డంగా నరికేస్తాం’ అంటారు. అది అప్పటికే. అట్లా నరికితే ఎవరన్నా మిగులుతరా! అడ్డమొస్తే గుంజికొట్టుడే అంటే ఎంతమందిని కొటిండ్రు. ఆ భాష ఉద్వేగాలున్న ప్రతిచోటా వచ్చేదే. అట్లని ఆ భాషను తెలంగాణ లో ఉన్న బుద్ధిజీవులు తగదని చెప్తూనే ఉంటారు. కేసీఆర్‌ను ఏ హరగోపాలో, ఏ వరవరరావో, ఏ గద్దరో, ఏ కోదండరామో విమర్శిస్తూనే ఉంటారు. అది దిద్దుబాటు విమర్శ. ఇట్లా వద్దనే విమర్శ. తెలంగాణ ఉద్యమం తీరుతెన్నుల మీద, పంథాల మీద మందకృష్ణ, గజ్జల కాంతం, ఐలయ్య లాంటి వాళ్ల తీవ్ర విమర్శలు కేసీఆర్ ఎదుర్కున్నారు.

ఈ ఉద్యమం పన్నెండేళ్ల కాలంలో కేసీఆర్ ఎదుర్కున్నన్ని విమర్శలు ఏ రాజకీయ నాయకుడూ ఎదుర్కోలేదు. నిజమే. విమర్శలు చేస్తున్న వాళ్లు కూడా ఉద్యమం బాగుండాలనే ఆకాంక్షతో చేస్తారు. ఉండవల్లి విషం కక్కా డు. కేసీఆర్‌ను ఒక రాక్షసుణ్ని చేసి, ఆయన ద్వారానే తెలంగాణ సాధ్యం కావడం లేదు. ఆయన వల్లనే మేము అంగీకరించడం లేదు. అని ఉద్యమానికి నాయకత్వం లేకుండా చెయ్యడం ఆయన అసలు కుట్ర. కానీ కేసీఆర్‌కు స్పష్టత ఉన్నది. ఆయన కొన్ని సాధించారు. తెలుగుతల్లి ఎవరి తల్లి అంటే పండితులు,పామరులు గయ్యిన లేచారు. ఇవ్వాళ్ల తెలంగాణలో తెలంగాణ తల్లే నిజం. మీ బిర్యానీ పెండపూక్కుంటదంటే మమ్మల్ని, మా ఖదర్‌ను న్యూనపరుస్తున్నారు. మీకే ఖదర్ తక్కువ అని మీ మనసుల్లో తుఫాను సృష్టించి అల్లకల్లోలం చేశారు. మీ పెత్తనానికి అది విరుగుడు. వరవరరావు ఒక సభలో అన్నారు. అవును కేసీఆర్‌ను తెలంగాణ ఆంధ్రావాళ్లు విమర్శించడానికి, వాళ్లు విమర్శించడానికీ తేడావుంది. వాళ్లది దుర్బుద్ధి. కేసీఆర్‌నూ, తద్వారా ఉద్యమాన్నీ నాశనం చేసేందుకే ఆ విమర్శలు. అవి ప్రమాదకరమైనవి.

అన్ని అంశాలతో పాటు ఉండవల్లి తనకు తెలియకుండానే ఒక మేలు చేశారు. అది విభజన. ఆంధ్రవూపదేశ్‌లో తెలంగాణ వాళ్లు వేరని, మేము వేరని, ఆంధ్రవూపదేశ్ అంటే మేమేనని, మీరు కాదని గొప్ప చీలిక ప్రదర్శన చేశారు. ఇంత నగ్నంగా చీలిక ఎన్నడూ కనపడలేదు. అందువల్ల ఇప్పుడిక తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ మిత్రులు తేల్చుకోవాలి. ఎమ్మెల్యేలు తేల్చుకోవాలి. మంత్రులు తేల్చుకోవాలి. ఉండవల్లిని పదునైన తిట్లతో విమర్శించడం ఎందుకు? అది సరిపోదు. ఢిల్లీలో షిండే మోసం చేశారు. గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్ మోసం చేశారు. రాహు ల్, సోనియాగాంధీలు గల కోర్ కమిటీ మోసం చేసింది. దురహంకారంతో ఆధిపత్యంతో ఉండవల్లి జై ఆంధ్రవూపదేశ్ సభ మోసం చేసింది. మిమ్మల్ని వేరు చేసింది. గీతగీసి నిలబడ్డది ఆంధ్రకాంక్షిగెస్. మీ ముందు రెండే రెండు అవకాశాలు. ఒకటి కాంగ్రెస్ ఎట్లాగూ మాది కాదు. ఇక మాకు న్యాయం జరగదు. పీసీసీ అధ్యక్షునితో సహా ఎవరూ మావేపు లేరు అనుకొని ఆ పార్టీనుంచి బయటపడి తెలంగాణ ప్రజాక్షేవూతంలో జరుగుతున్న ఉద్యమంలో చేరడమా? లేదా బానిసలుగా ఉండడమా? బానిసలుగా బతుకు ఈడ్చడమా? అది తేల్చుకోవాలి గానీ ఇది గుర్రం, ఇది మైదానం అని ఉండవల్లి చెప్పినందుకు ఆయనను తిట్టడం పిరికి వాళ్ల పని. మీరు పిరికి వాళ్లా. తెలంగాణ పౌరుషం కలవాళ్లో తేల్చుకోవాల్సిన సమయం ఇదే.

ఇవన్నింటి తర్వాత తెలంగాణ ప్రజలకు, ఉద్యమానికి ఇక మిగిలింది కూడా రెండు మార్గాలే. కాంగ్రెస్ మళ్లీ ధోకా ఇచ్చింది. మోసం చేసింది. సీమాంధ్ర పెత్తందారులు చెలరేగి పోయి, విడిపోయి విషం కక్కుతున్నరు. బహుశా మన ఉద్యమం వాళ్ల మూలాలను కదిలించడం లేదు. మన ఉద్యమం సీమాంవూధుల లాబీలకన్నా శక్తివంతంగాలేదు. కనుక ఈ దశ నుంచి మరోదశకు శాంతి యుతంగానే ప్రజాస్వామ్యబద్దంగా, సమర శీలతను పెంచి వచ్చేదాకా పోరాడడమా? లేదా మనమూ బానిసలమే అని అంగీకరించి, మాటలు పడుతూ, దోపిడీ భరిస్తూ, చివరికి వాళ్లు మన గోచి కూడా వొలుచుకొనే దాకా శాశ్వత బానిసలు కావడమా తేల్చుకోవలసి ఉన్నది. ఇది సంధికాలం. సందర్భం. కానీ కేవీ రంగాడ్డి ఇట్లా అన్నాడు. ‘గులామ్‌కీ జిందగీ సే మౌత్ అచ్ఛీ హై’ బానిస బతుకు కన్నా చావు మేలు. తేల్చుకోవలసింది మనమే. ఉండవల్లి ఒక లక్ష్యం కోసం , ఉద్వేగాలు
రెచ్చగొట్టి అటు సీమాంధ్ర ప్రజలను వీధుల్లోకి రప్పించడానికి, ఇటు తెలంగాణ ప్రజలను ఇప్పటిదాకా అనుసరించిన పంథా నుంచి మరో పంథాలోకి మళ్లించడానికి పన్నిన కుట్ర. ఈ కుట్రను ఛేదించాలి. అనుకూలంగా మలుచుకోవాలి,
చివరగా అహింసకు మారు పేరని చెప్పుకునే మహాత్ముని మాటలతో
‘శాంతి, అహింస పేరిట ఆత్మాభిమానం కోల్పోవడం కంటే.. హింసపైన నమ్మకం లేకున్నా.. హింసాత్మకంగా ఉద్యమించడం మంచిది’
ఉండవల్లికి సూచన.. నిజంగానే తెలంగాణకు సంబంధించి మేము చెప్తున్న అన్ని సత్యాల్లాగానే పై మాట గాంధీ అన్న మాటే...’ సెలవు

-అల్లం నారాయణ

Wednesday, January 02, 2013

ఎటూ తేలని ‘తెలంగాణ’

ఎటూ తేలని ‘తెలంగాణ’!

(Main Feature Wednesday January 02, 2013)http://www.andhrabhoomi.net/content/e-86

అఖిలపక్ష సమావేశంలోని అభిప్రాయాలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటే తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకించడానికి ఇక ఆ పార్టీకి ఏ కారణం మిగలలేదు. కేంద్రంలో అధికార పక్షం కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బిజెపి. నిజానికి ఈ రెండు పార్టీల సంఖ్యా బలం చాలు తెలంగాణ ఏర్పాటు చేయడానికి. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నికల వరకు నిలుపుకోవడంతో పాటు టిడిపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలను అడ్డుకోవడానికి తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ ఇంత కాలం ఉపయోగించుకుంది. ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాన రాజకీయ పక్షాలన్నీ తెలంగాణ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశాయి. నర్మగర్భంగా చెప్పినా, డొంక తిరుగుడుగా చెప్పినా ప్రధాన పక్షాలేవీ సమైక్యాంధ్ర డిమాండ్ చేయలేదు. అభిప్రాయం చెప్పలేదు అంటూ కాంగ్రెస్ ఇక ఇతర పార్టీలపై నెపం నెట్టివేయలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయదలిచినా, చేసే ఉద్దేశం లేకపోయినా ఇక నిర్ణయం ప్రకటించాల్సిన బాధ్యత కాంగ్రెస్‌దే.
ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసినప్పుడు మూడు వారాల్లో కమిటీ తన నివేదిక ఇస్తుందని ప్రకటించారు. నాలుగేళ్లు అవుతున్నా ఆ కమిటీ ఉందా? లేదా? ఉంటే కమిటీ నివేదిక ఏమిటో ఇప్పటి వరకు వెల్లడించలేదు. శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసినా, ప్రణబ్ కమిటీ అన్నా, అఖిలపక్ష సమావేశం అని చెప్పినా కాంగ్రెస్ కోరుకున్నది తెలంగాణ వ్యవహారం 2014 వరకు సాగదీయడం మాత్రమే.
అసలు ఒక నాయకుడంటూ లేక చుక్కాని లేని నావలా రాష్ట్రంలో కొట్టుకు పోతున్న కాంగ్రెస్ తెలంగాణ అంశం ద్వారా రాష్ట్రంలో తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంది. తెలంగాణ డిమాండ్ అంటూ లేకపోయి ఉంటే వైఎస్‌ఆర్ మరణం తరువాత టిడిపి తిరుగులేని శక్తిగా నిలబడేది. ఆ తరువాత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. ఉప ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లో దూసుకువెళ్లిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశం వల్లనే తెలంగాణలో దూసుకెళ్లలేకపోయిం ది. టిడిపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణ అంశం స్పీడ్ బ్రేకర్‌గా నిలబడింది. కాంగ్రెస్ కోరుకున్నది ఇదే. అన్ని రాజకీయ పార్టీలు నిర్ణయాలు చెప్పలేదనో, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయనో, టిడిపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు అభిప్రాయం చెప్పలేదని చెబుతూనో కాంగ్రెస్ ఇంత కాలం తప్పించుకుంటూ వస్తోంది.
అఖిలపక్ష సమావేశంలో అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. దాదాపు అన్ని పార్టీలు తెలంగాణ ఏర్పాటుకు ఏదో ఒక రూపంలో సుముఖత వ్యక్తం చేశాయి. ఇతర ప్రాంతాల్లో తమ పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు మాటల గారడి చేయవచ్చు!
రాష్ట్రంలో ప్రధానమైన రాజకీయ పక్షాలు టిడిపి, టిఆర్‌ఎస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు. రాష్ట్రంలో ఉనికి స్వల్పమే అయినా జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ.. ఈ పార్టీలన్నీ తెలంగాణకు సానుకూలత వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చెప్పడం కాదు నిర్ణయాన్ని అమలు చేయాల్సిన స్థానంలో ఉంది. ఆ పార్టీ నిర్ణయం చెప్పాలని డిమాండ్ చేయడం కాదు, నిర్ణయాన్ని అమలు చేయాలని అన్ని పార్టీలు కాంగ్రెస్‌పై ఒత్తిడి తీసుకురావలసిన పరిస్థితి.
ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్న సిపిఎం తమ పార్టీది సమైక్యాంధ్ర విధానపరమైన నిర్ణయం అని, అయితే తెలంగాణ ఏర్పాటును తాము అడ్డుకోమని స్పష్టంగా ప్రకటించింది. తక్షణం నిర్ణయం తీసుకోవాలని కోరింది కూడా. ఇక పాత నగరంలో ఒక మతానికి పరిమితం అయిన ఎంఐఎం పార్టీ రాయల తెలంగాణ ప్రతిపాదన చేసింది. చివరకు ఈ రెండు పార్టీలు సైతం సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తామని కానీ చెప్పలేదు. టిఆర్‌ఎస్, బిజెపి, సిపిఐ, టిడిపి పార్టీలు తెలంగాణ ఏర్పాటు చేయాలని కోరాయి.
తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న టిడిపి 2008లో ప్రణబ్ కమిటీకి లేఖ రాసింది. ఇప్పుడు మళ్లీ కొత్తగా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని అఖిలపక్షంలో వెల్లడిస్తే,సీమాంధ్రలో తమకు ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకుని 2008 లేఖను ప్రస్తావించింది. దీని ద్వారా ఇటు తెలంగాణ ప్రజలకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా, ఇది కొత్త నిర్ణయం కాదు ఎప్పుడో 2008లో తీసుకున్న నిర్ణయం కదా అని సీమాంధ్ర నాయకులను బుజ్జగించడానికి టిడిపి ప్రయత్నించింది. 2008లో తాము తీసుకున్న నిర్ణయాన్ని జత చేస్తూ, తెలంగాణకు అనుకూలత వ్యక్తం చేసింది. ఇక లేఖ అందజేసి మాట్లాడిన టిడిపి ప్రతినిధి కడియం శ్రీహరి తెలంగాణ ఏర్పాటు చేయాల్సిందే, రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ తప్ప మరో అభిప్రాయం లేదని కుండ బద్ధలు కొట్టినట్టు చెప్పారు. కడియం శ్రీహరి టిడిపి ప్రతినిధిగానే అఖిలపక్ష సమావేశానికి వెళ్లారు. రెండు ప్రాంతాల నాయకులు విలేఖరుల సమావేశాల్లో రెండు వైఖరులను వెల్లడించడం సహజమే కానీ కడియం పార్టీ ప్రతినిధిగానే అఖిలపక్ష సమావేశంలో వైఖరి వెల్లడించారు. అఖిలపక్షానికి వచ్చే ప్రతినిధులను పార్టీ అభిప్రాయాలను వెల్లడించమని హోంమంత్రి కోరారు కానీ లిఖిత పూర్వకంగా అభిప్రాయం చెప్పమని ఏమీ కోరలేదు. రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా టిడిపి పాత లేఖను తిరిగి ఇస్తే, తెలంగాణలో టిడిపిని చావుదెబ్బతీస్తేనే తమ పార్టీకి ప్రయోజనం అనే భావనతో ఉన్న టిఆర్‌ఎస్ టిడిపి స్పష్టమైన వైఖరి చెప్పలేదని విమర్శిస్తోంది. టిడిపి తన స్పష్టమైన వైఖరి వెల్లడించలేదని హోంమంత్రి ప్రకటిస్తే, అప్పుడు టిడిపిని తప్పు పట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ సమావేశంలో స్పష్టమైన వైఖరి వెల్లడించి, 2008 లేఖను తిరిగి ఇవ్వడం ద్వారా టిడిపి తెలంగాణకు స్పష్టంగానే అనుకూలత వ్యక్తం చేసింది.
ఇక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం సమైక్యవాదన వినిపించలేదు. పార్లమెంటు సమావేశంలో జగన్ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు సోనియాగాంధీ సమక్షంలోనే సమైక్యాంధ్ర కోసం టిడిపి ఎంపిల ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. అలాంటిది కీలకమైన అఖిలపక్ష సమావేశంలో మాత్రం సమైక్యాంధ్ర వాదన వినిపించలేదు. రాష్ట్ర విభజన బాధ్యతను కేంద్రంపైనే నెట్టివేసి, ఆర్టికల్ 3 ప్రకారం ఆ అధికారం కేంద్రానికే ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలి అని నేరుగా డిమాండ్ చేయకపోయినా తెలంగాణ ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదనే విధంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభిప్రాయం ఉంది. అయతే టిడిపి కంటె తెలంగాణలో తనకే పట్టు ఉంటుందన్న నమ్మకం కూడా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ఇదే సమయంలో సీమాంధ్రలో పార్టీ బలహీన పడకుండా ఉండాలంటే మొత్తం బాధ్యతను కాంగ్రెస్ మీద నెట్టేస్తే సరిపోతుందన్న భావన ఆ పార్టీది. అదీ కాకుండా సీమాంధ్రలో తనకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ తెలంగాణకు సానుకూ లత వ్యక్త్తం చేయడంతో ఆ పార్టీలో లుకలుకలు బయలుదేరితే వాటిని తనకు అనుకూలంగా మలచుకోవాలన్న వ్యూహం కూడా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. నిజానికి పరిస్థితి కూడా అట్లాగే ఉంది. అప్పుడే తెలుగుదేశం సీమాంధ్ర నేతల్లో అసంతృప్తులు బయలు దేరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయ. ఒకరకంగా పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వల్ల తెలంగాణలో బలపడటం మాట అట్లావుంచి సీమాం ధ్రలో పార్టీపై పడే ప్రభావం తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు. ఇక్కడ రాజకీయ చతురత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానంలో కనిపి స్త్తున్నది.
చిదంబరం హోంమంత్రిగా ఉన్నప్పుడు అఖిలపక్ష సమావేశంలోనైనా, ఆ తరువాత పార్లమెంటు సమావేశాల్లోనూ కొన్ని పార్టీలు స్పష్టమైన వైఖరి వెల్లడించలేదని చెప్పారు. అలాంటి అనుమానం ఏమైనా ఉంటే అఖిలపక్షం తరువాత షిండే అదే చెప్పి ఉండాల్సింది.
కాంగ్రెస్ ఇద్దరు ప్రతినిధుల్లో ఒకరు సురేష్‌రెడ్డి తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయగా, సమైక్యాంధ్రను కొనసాగించాలి ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అంటూ గాదె వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. గాదె వెంకటరెడ్డి మొదటి నుంచి సమైక్యవాదన వినిపిస్తున్నారు. ఇద్దరు కాంగ్రెస్ ప్రతినిధులను ఎంపిక చేసింది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కాదు. అధిష్ఠానమే. కాంగ్రెస్ హై కమాండ్ అనుమతితోనే కాంగ్రెస్ ప్రతినిధులు రెండు అభిప్రాయాలను వెల్లడించారు. అధిష్ఠాన వర్గం నిర్ణయించిన కాంగ్రెస్ ప్రతినిధిగా అఖిలపక్ష సమావేశానికి వెళ్లిన గాదె వెంకటరెడ్డి చెప్పిన విషయం కాంగ్రెస్ నిర్ణయంగా భావిస్తారు
కానీ గాదె చెప్పినట్టు ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా భావించరు. అఖిలపక్ష సమా వేశం జరిగిన తరువాత హైదరాబాద్‌కు వచ్చిన గాదె వెంకటరెడ్డి టీవి ఇంట ర్వ్యూలో హైకమాండ్‌తో మాట్లాడాను, సమావేశంలో ఏం చెప్పాలని అడిగాను. మీ అభిప్రాయం మీరు చెప్పి, చివరకు అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పండి అని చెప్పారని స్వయంగా గాదె చెప్పారు. దీన్నిబట్టి చూస్తే 2014 ఎన్నికల వరకు ప్రత్యర్థులను తెలం గాణ అంశం ద్వారా ఇబ్బంది పెట్టాలన్న వ్యూహంతో కాంగ్రెస్ ముందుకు సాగుతు న్న దనిపిస్తోంది.
మూడు వారాల్లో నివేదిక అంటూ వేసిన ప్రణబ్ కమిటీకే నాలుగేళ్లయినా దిక్కుమొక్కూ లేదు. అలాంటిది హోంమంత్రి నెల రోజుల్లో అని చెప్పగానే నెలలో ఏదో చేసేస్తుందనే నమ్మకం తెలంగాణ కోరుకునే వారిలో కనిపించడం లేదు. నెలలో ఏదో అయిపోందని చెప్పలేం అలానే ఏమీ కాదని కూడా చెప్పలేని పరిస్థితి. ఎన్నికల నాటికి కాంగ్రెస్ తనకు లాభసాటిగా ఉండే నిర్ణయం తీసుకుంటుంది. ఈ లాభం ఎన్నికల నాటికి వేసుకునే లెక్కల్లో ఎటు మొగ్గితే లాభం అని తేలితే అటు వైపుకు అనుకూలంగా ఉంటుందనడంలో ఏమా త్రం సందేహం లేదు.

Monday, December 10, 2012

డిసెంబర్ 9, ఒక నిజం

 

డిసెంబర్ 9, ఒక నిజం
http://www.namasthetelangaana.com/Editpage/columnists/Allam-Narayana.asp?ContentId=181905#Scene_1
pranahita
ఆర్ట్స్ కాలేజీ ముందర ఒక గాయపడిన చెట్టుంది! ఆ చెట్టుకు వందనం. సంతోష్ శవం వేలాడిన చెట్టు. జీవంతో తొణికిసలాడుతూ ఉన్న సంతోష్‌తో చివరి తెలంగాణ ముచ్చట్లు పంచుకున్న చెట్టు. సంతోష్ చివరి కోరికా, ఏమాత్రం మార్మికం కాని బహిరంగ ఆలాపనా ఆ చెట్టుకు తెలుసు. పచ్చదనం మాత్రమే ప్రపంచానికి పంచే ఆ చెట్టు సంతోష్ చివరి జీవునం తన్నుకులాడినప్పు డు మోడువారినట్టు విలవిలలాడినట్టున్నది. ఆ చెట్టు మూడేండ్ల కిందట సఫలమ యి విఫలమయిన కలను గన్న చెట్టు. యవ్వన తేజంతో వెలిగిన ఆర్ట్స్ కాలేజీ వైభవాన్ని, పోరాట సంప్రదాయాన్ని కళ్లు తెరుచుకుని చూసిన చెట్టు. అదొక సాఫల్యాన్ని కళ్లు విప్పార్చుకొని పత్రసతతంగా సయ్యాటలాడి వీక్షించింది. కొమ్మల తలలూపుతూ ‘కదనాన శత్రువుల కుత్తుకలు తెగటార్చ’ ఆకుల బాకులు దూసి ఇదీ తెలంగాణ అని విద్యార్థి వీరుల గానాలను విన్నది. గాలికి నృత్యం చేసింది. సంబురం అంబరమంటిన ఆ డిసెంబర్ 9 అర్ధరాత్రీ, అపరాత్రీ తెల్లవారిందాకా ఊగితూగిన తెలంగాణవాదులతో కత్తుకలిపింది. కదం కలిపింది. పదం కలిపింది. ఆ చెట్టు ఇంకా కలగంటున్నది. డిసెంబర్ 9 నిజమే. అది ఆరు దశాబ్దాల దుఃఖ సమువూదపు చివరి ఒడ్డు. అంతంలేని బాధల గాధల పల్లవుల చివరి చరణం. ఆ రాత్రి. ఎంతకీ తెల్లారని రాత్రి. మూడేండ్ల తర్వాత కూడా కలలోలా? మెలకువలాగా సందిగ్ధం లాగా సంధిలాగా.. జ్వరపీడనలాగా. ప్రేలాపనలాగా, ఆలాపనలాగా, ఆర్సిపెట్టిన దద్దరిల్లి ప్రతిధ్వనించిన ఆర్ట్స్ కాలేజీ ఏకశిలా స్తంభాలలో పరివ్యాపించిన కేకలాగా.. తెలంగాణ వచ్చింది. మున్నూటా అరవై తొమ్మిది మంది త్యాగాల మునుమే కదా! వెయ్యిమంది బలిదానాల తెగువే కదా! తెలంగాణ, తెలంగాణ.. గుండె గుండె కూ వ్యాపించింది తెలంగాణ. మనం గెలిచాం.. ఆడుదాం ధూలా. నెగళ్లు ఎగసిన ఆర్ట్స్ కాలేజీ. డిసెంబర్ రాత్రి చలికి వేడి పుట్టించిన ఆకాశమెత్తు ఎగిసిన నినాదాలు. దిక్కులు పిక్కటిల్లే చివరి నినాదం.

గెలుపూ మనదే. విజయహాసమూ మనదే. జై తెలంగాణ. చెట్టు సంబరపడింది. చెట్టు కొంచెం క్షోభపడింది. తరతరాల దుక్కం వెక్కిళ్లలోకి అంతమైంది. కానీ, కానీ, కానీ... మూడేండ్ల తర్వాత ఒకానొక విషాద రాత్రి. కేరింతలు కొట్టిన యవ్వనం. డస్సిపోయి, భంగపడి చెట్టుదగ్గర నిలబడింది. తెలంగాణ ఇంకా తెల్లారలేదు. ఇస్ రాత్‌కా సుభా నహీఁ. విసిగిపోయాను ఈ ప్రపంచం మీద, రాజకీయాల మీద.. చివరికి ప్రజాస్వామ్యం మీదా నాలుక మడిచిన ప్రజాస్వామ్య సౌధాల మీద. చివరికి జీవితంమీదా రోసిపోయిన వాడు నిలబడ్డప్పుడు దుక్కాన్నీ, నవ్వునీ, సంబురాన్నీ, విషాదాన్నీ ఏకకాలంలో అనుభవించి న ఆ చెట్టు గజగజా వణికింది. పత్రహరితంలా పరుచుకోవాల్సిన యవ్వనం, పండు వెన్నెలై వికసించాల్సిన యవ్వనం, పండిత, సిద్ధాంత చర్చల్లో పరిఢవిల్లాల్సిన యవ్వ నం, ప్రేమలో వికసించే విద్యుత్తేజం కావాల్సిన యవ్వనం నిండురూపంతో తనముందు నిలబడి తల్లడిల్లినప్పుడు ఆ చెట్టు భయంతోనూ, భీతితోనూ మూర్ఛనలు పోయింది. రాజకీయమా! ఏమి శెరపెట్టినవ్ ఈ తెలంగాణ బిడ్డలకు.

మ్రాన్పడిపోయింది చెట్టు. ఉరితాడు వేస్తున్నప్పుడు బిగుసుకుపోయింది. శవమై వేలాడినప్పుడు కన్నీటి చుక్కలు విడిచి మ్రాన్పడిపోయింది చెట్టు. ఆ చెట్టు ఇప్పుడు మౌన సాక్షి. ఆ చెట్టు ఇప్పుడు ఘనీభవించిన నిశ్శబ్ద సంకేతం. ఆ చెట్టు ఇప్పుడు పిట్ట పీచుమనని నీరవ నిశబ్దంలోకి జారుకున్నది. ఆ చెట్టుకు వందనం. సంతోష్ కూ, అతని తెల్లారని కలకూ వందనం. ఆ కల తెల్లారాల్సి ఉన్నది. ఆ కల సాకారం అయ్యే తీరవలసి ఉన్నది. అది తెలంగాణ. డిసెంబర్ 9 నిజమే. అది వర్తమానంలో దశాబ్దాల పేదనలకు ఒక ఊరట. రెక్కవిప్పి గర్జించిన ఆత్మగౌరవ విజయ చిహ్నం డిసెంబర్ 9. ఆ డిసెంబర్ విని ఆవాహన చేసుకోవడమే చెట్టు సందేశం. ఆ చెట్టే మన ప్రాణం. ప్రాణమై వికసించడమే. నిరాశ నుంచీ, నీరసాల నుంచీ, అచేతన నుంచి, నిశ్శబ్దాలను బద్దలుకొట్టడమే చెట్టు జీవనసారం. యస్. డిసెంబర్ 9 ఒక స్ఫూర్తి. ఒక ఆలంబన. ఒక పోరాటం. గెలిచిన రోజు. కేసీఆర్ ఆస్పవూతిలో మరణపు మెట్ల ముందు దీక్షలో ఉన్నాడు. తెలంగాణ భగ్గున మండింది. అంటుకున్నది తెలంగాణ. విద్యార్థులు గర్జించారు. ఆర్ట్స్ కాలేజీ ముందు లేచిన గుడారాల్లో విప్లవాలకు కలలు నేర్పారు. కత్తులకు కోలాటం నేర్పింది తెలంగాణ ఎత్తిన జెండా. ఆర్ట్స్ కాలేజీ నిద్రపోలేదు. అవును ముట్టడిస్తాం అసెంబ్లీని. ఎంతకైతె గంతకాయె. మాకు తెలంగాణ కావాలె. ముట్టడిస్తాం మీ సౌధాలను. డిసెంబర్ 9 ఒక కల విడుదలయింది. ఒక రాత్రి ఇంకా తెల్లారనేలేదు.

‘డూ నాట్ డై’కృషాంక్, తలపగిలిన భాస్కర్ ఢిల్లీలో ఉన్నట్టున్నారు. తల్లిచెట్టుకు దూరంగా. ఆర్ట్స్ కాలేజీ బోసిపోయి ఉన్నది. నిన్న కూడా ఇక్కడ సభ జరిగింది. చెట్టు తలూపి ఉంటుంది. మౌనంగా చూసి ఉంటుంది. అది సంతోష్ దుక్కంలో మునిగిపోయి ఉంటుంది. ఢిల్లీ తోలుబొమ్మలాటల కేంద్రం. అదొక ఆత్మలేని సిమెంటు తాపడం చేసిన నగరం. జర్రున జారే రోడ్ల మీద ప్రవహిస్తున్న తెలంగాణ యవ్వనం. జాడ తప్పి జంతర్ మంతర్ ముందర. అవును మేం ముట్టడిస్తాం. దేన్ని. ఆర్ట్స్ కాలేజీ బోసిపోయి ఉన్నది. మూడేండ్ల కిందటి సంబురాలు లేవు. ఢిల్లీ గేట్ల ముందర ఆట. గారడి ఆటలకు గుండెలు తెరుచుకోవు. శాస్త్రి భవన్ చెట్టుకు వేలాడిన యాదిడ్డి. ఢిల్లీకి కూడా అంటిన తెలంగాణ నెత్తుటి చారిక. టెన్ జనపథ్ లో మరుగున పడిన త్యాగాల కలలను కూడా గుర్తించదు. సాఫల్యాలనూ వైఫల్యం చేసే గారడి విద్యలు తెలిసినవారు మూగిన ప్రాంతాలు మన నిషేధిత ప్రాంతాలు.

చివరికిలా మిగిలామా? యూటూ.... వీధులు ఎదురు చూస్తున్న వేళ. అసెంబ్లీ భవనాలు ముట్టడి కోసం ఇనుప కంచెలు కట్టుకుంటున్న వేళ. ఉవ్వెత్తున ఎగసే అలల కోసం ట్యాంక్‌బండూ, నెక్లెస్‌రోడ్డూ ఎదురుచూస్తున్న వేళ జంతర్‌మంతర్ దగ్గర దిగాలు పడ్తున్న యవ్వనం. ఆర్ట్స్ కాలేజీ ఢిల్లీకి తరలిపోతున్నప్పుడు, ఆర్ట్స్ కాలేజీ ఆత్మలను కోల్పోతున్నప్పుడు, ఆర్ట్స్ కాలేజీ అపవూభంశపు పోకడలు పోతున్నప్పుడు, ఆర్ట్స్ కాలేజీ ముందరి ఆ చెట్టు విలవిలలాడింది. తండ్లాడింది. బిడ్డలారా! గొంతు గద్గదమై ఏ మాటా చెప్పలేకపోయింది చెట్టు. బతుకు ఇక్కడే. చావు ఇక్కడే. బాతఖానీ క్లబ్బుల్లో ప్రవహించే అబద్ధాల సాలెగూడుల్లోకి వెళ్లకండి వీరులారా! విద్యార్థులారా! సంతోష్ మీద ఆన.. మీ కోసం ఆర్ట్స్ కాలేజీ ముందరి మైదానం ఎదురుచూస్తున్నది. సబ్బండ వర్ణాలు, సబ్బండ జాక్‌లు ఒక్కటై, ఒక్క పొలికేక పెట్టి.. అయ్యో! నిజమే ఉద్యమం ‘ఇన్నోసెన్స్’ను కోరుకుంటుంది. త్యాగనిరతిని కోరుకుంటుంది. ఉద్యమం ఐచ్ఛికతనూ, అంకితభావాన్ని, స్వీయ ప్రయోజన రాహిత్యాన్ని కోరుకుంటుంది. ఏవవి. మిత్రులారా! పోగొట్టుకున్నాం మనం.

కానీ పొందడానికి ఏమీ లేదు. ఇంకా మూడేండ్ల కిందటి డిసెంబర్ అతి పొడవైన ఆ రాత్రి తెల్లరనే లేదు. నిజమే. స్వార్థం శిరస్సు గండ్రగొడ్డలితో నరకగలిగిన వాడే నేటి హీరో... తెలంగాణ పిలుస్తున్నది. నిజమే ఢిల్లీల లేదు పరిష్కారం. నిజమే గల్లీలనే ఉన్నది. జీనాహైఁతో మర్‌నా సీఖో కదమ్ కదమ్ పర్ లడ్‌నా సీఖో.. తెలంగాణ వచ్చింది. దాన్ని కాపాడుకోవడమే. ఒక కల సాకారమైంది. దాన్ని అనుభవించి పలవరించడమే. పట్టిన పట్టు సడలకపోవడమే. తోలుబొమ్మలాటల్లో చిక్కుపడిన దారపు కండె ఉద్యమం.

ఈంట్‌కా జవాబ్ పత్థర్‌సే...
ప్రతీకారం కోరుతున్నది తెలంగాణ. వర్నిలో ఆంధ్రులు తెలంగాణ పిల్లలను కొట్టారు. తెలుసా! రెండు ఇటుకల మధ్య తల ఇరికించి ఇప్పుడనరా! సమైక్యాంధ్ర జిందాబాద్ అని హింసించిన వాడి చిరునామా నిజామాబాద్. పాలమూరు విశ్వవిద్యాలయంలో పోలీసులు, షర్మిల సేన నెత్తురు కళ్ల చూశారు. జై తెలంగాణ అన్నందుకు విద్యార్థులకు బహుమానం. భైంసాలో ఇల్లిల్లు తిరిగీ కొట్టారు పోలీసులు. మాలల తిరుగుబాటు. మన్నాల తిరుగుబాటు. చంద్రబాబూ తెలంగాణపై తేల్చమన్నందుకు లాఠీల కరాళనృత్యం. ప్రపంచం సజావుగా ఉన్నది. కవి తీవ్ర అభినివేశంతో మరో కవిత రాసుకుంటున్నాడు. సంకలనం కొత్తదొకటి తయారవుతున్నది. ఇప్పుడిది సందర్భం. పాటగాడు కొత్త క్యాసెట్ కోసం రికార్డింగ్ థియేటర్ గుమ్మం ముందు నిలుచున్నాడు. వీర విద్యార్థి ఒకడు నియోజకవర్గం ముందు తలదూర్చుకుని నిలుచున్నాడు. యువసేన తెలంగాణ క్రికెట్ ఆటాడుతున్నది. ఇందిరాపార్క్ ముందు పదమూడోసారి ధర్నాలో ప్రసంగిస్తున్నడు ఒక నాయకుడు తెలంగాణపై ఏమి చేయాలన్న మీమాంసలో సదస్సు జరుగుతున్నది. వేదికలు పునరుక్తి దోషాలతో తడబడ్తున్నవి.

టీవీ చర్చలో పదహారోసారి. తెలంగాణను రోషంతో వీరరసంతో నూటా ఒక్కటో సారి అదే భాషతో పలికిస్తున్నడు విశ్లేషకుడు. చంద్రబాబు కు, షర్మిలకు, కిరణ్‌కుమార్‌డ్డికీ తెలంగాణ మీద అప్రకటిత ప్రేమ కలిగినందు వల్ల వారు ఊరూరా పొరుకపోడుగా పదఘట్టనలతో ఊదరగొడ్తున్నారు. ఢిల్లీకెళ్లిన చైతన్యం.. చెట్టు ప్రాణవాయువు నింపుకుని రాయి విసిరి రక్తమోడుతున్నది. పల్లెబాటలు బారులు తీరుతున్నవి పతాకాలు. కూద్ ఖేల్.. మస్తీ మజా.. జంప్ జిలానీలు అగ్గడ్‌బగ్గడ్ ఆగమాగంగ దుంకుతున్నరు. తరాజులో న్యాయంవేపు ఆశగా చూస్తున్నదొక బిచ్చగత్తె. ఎఫ్‌డీఐల్లో విప్లవాన్ని కలగంటున్నడు కురువృద్ధుడైన మన్‌మోహన్‌సింగ్. ప్రపంచం సజావుగానే ఉన్నది.

వర్నిలో గాయపడిన పిల్లగాని పెయ్యి సలుపుతున్నది. అతనికి లోలోన ఆక్రమించుకున్న కలకూడా సలుపుతున్నది. లగడపాటి మళ్లీ మాట్లాడాడు తీవ్ర విద్వేషంతో. యూనివర్సీటీకి రా దమ్ముంటే అని విద్యార్థి నాయకుడొకరు సవాల్ చేశాడు. అతను ఆర్ట్స్ కాలేజీని మూతేయమని చెప్పినవాడు. రాడు. లగడపాటిని వెతకాల్సిన పనిలేదు. కానీ వెతుకులాటలేని వ్యథల జీవితంలో ‘డూ నాట్ డై’... నిజమే. దిమ్మెలుండవు. జెండాలుండవు. ఫ్లెక్సీలు తగులబడుతవి. డిసెంబర్ 9 ఒక సఫలమైన కల. డిసెంబర్ 9 ఒక ఆకాంక్షకు అర్థవంతమైన ముగింపు. తెలంగాణ దానిచుట్టూ బరిగీసి నిలబడి ఉన్నది. రక్షించుకుందాం డిసెంబర్ 9ని.. అది మన తెల్లారని రాత్రి. కనుప్పలల్లో దాగున్న విజయం. ఖబడ్దార్ డిసెంబర్ 9 నిజం. అఖిలపక్షా లు, అడ్డగోలు ప్రకటనలు ఇంకానా ఇక చెల్లవు. రగులుకుంటున్నది రగల్ జెండా. తెలంగాణ డిసెంబర్ 9ని కీర్తిస్తున్నది. ఆవాహన చేసుకుంటున్నది. నమ్ముతున్నది.. ఆర్ట్స్ కాలేజీలో మూడేండ్ల కింద ప్రారంభమైన సంబరాలు.. అతి పొడవైన ఈ రాత్రి నుంచి వేకువ కోసం ఎదురు చూస్తున్నది.. రగులుకుంటున్నది. ఎర్రటి పొద్దు. అవును తెల్లవారక మానదు. తెలంగాణ రాక మానదు. ఇంటి వాకిట్లో నిలబడి ఉన్నడు శ్రీకాంతచారి నిలువెత్తు మంటల్లో.. ఇక తప్పదు. అడ్డంపడ్డ వారి చీకటి కొట్టాలకు నిప్పంటక మానదు. మళ్లీ పాడతాం అదేపాట.. ఆ చెట్టుకు మొక్కి.. చెట్టు ఆకుల బాకులు దూసేదాక.. ఈ రాత్రి తెల్లారే దాకా.. చెట్టు మీద ఆన.. జై తెలంగాణ.
-అల్లం నారాయణ