Sunday, September 30, 2012

నేను ఉద్యమాన్ని..

నేను ఉద్యమాన్ని..

 
 










 

 


Women
 
రాజుగారి ఏడుగురు కొడుకులు, ఏడు చేపలు కథలో.. చీమ... తను కష్టపడి కట్టుకున్న పుట్టలో వేలు పెట్టిన అబ్బాయిని కుడుతుంది! తన గూడు చెదరగొట్టాలనుకున్న పిల్లాడి మీదికి చీమ తిరగబడిందన్నమాట!
పెసరుగింజంత పరిమాణంలేని చీమకే అంత పౌరుషం ఉంటే భావోద్వేగాలు ప్రకటించగల సత్తా ఉన్న ప్రజలకెంత ఉండాలి ? అందుకే తెలంగాణ గూటిని చెదరగొడుతున్న పరాయి పాలకుల మీద
తిరగబడుతున్న తెలంగాణవాదులతో ఉద్యమం తన అంతరంగాన్ని పంచుకోవాలనుకుంటుంది...

‘ప్రపంచంలో అస్తిత్వం కోసం ఆరాటం ఎన్నడు మొదలైందో ఆనాడే నేను పుట్టిన. నాటి నుంచి విప్లవం అని, ఉద్యమం అని నన్ను రకరకాలుగా పిలుచుకుంటున్నరు. కొన్ని చోట్ల నన్ను హింసగా మార్చినరు, ఇంకొన్ని చోట్ల శాంతిగా పిలిచినరు. తమ ఉనికి కోసం నా మద్దతు కోరిన అన్ని చోట్లా ప్రజలు గెలుపునే పొందినరు. ఇండిపెండెన్స్ వార్ ఆఫ్ అమెరికా, ఫ్రెంచి విప్లవం, రష్యన్ రివల్యూషన్, ఆఫ్రికా, అమెరికా సివిల్ రైట్స్ వార్ నుంచి నిన్నమొన్న జార్జియాలో వచ్చిన గులాబీ విప్లవం, టునీషియాలో వెల్లు జాస్మిన్ విప్లవం దాకా ఎన్నో చోట్ల ఎన్నెన్నో పేర్లతో నన్ను కావాలనుకున్న వాళ్లకు విజయమే వరించింది!
ఈ దేశంలో...

నాకు ..ఈ దేశానికి ఉన్న అనుబంధం రెండు శతాబ్దాలకు పైనే! బ్రిటిషర్స్ ఈ దేశాన్ని గుప్పిట్లో పెట్టుకున్ననాడే నేనిక్కడ అడుగుపెట్టాను. దాదాపు వందేండ్ల పోరుకు అడుగులు పేర్చిన. ఈ దేశాన్ని దాస్యం నుంచి విడిపించిందేకు గణేశ్ ఉత్సవాలు, గ్రంథాలయ ఉద్యమాలు వంటి చిన్న చిన్న రూపాల నుంచి స్వాతంత్య్ర సమరం అనే ఉగ్రరూపందాకా చాలా ఆకారాలు దాల్చిన. అంతెందుకు అన్యాయానికి వ్యతిరేకంగా నలుగురు గూడిన చోట నేనుంటా. అట్ల ఈ దేశానికి స్వేచ్ఛను తీసుకురావడానికి ముందుకు వచ్చిన యోధులందరికీ నా శక్తిని ధారపోసిన. దేశమంతా స్వాతంత్య్రం వచ్చింది. అప్పుడు మీకు రాలేకదా... వెంటనే సాయుధ రైతాంగ పోరాట అవతారమెత్తి మీకు కొత్త ఉత్తేజాన్నిచ్చిన. నేను పూనిన తెలంగాణ ప్రజల ఆవేశాన్ని చూసి రజాకార్లు తోకముడిచినరు. పీడ పోయింది. బిడ్డలిగ క్షేమంగ ఉంటరని నేనూ జర సల్లవడ్డ.

అదేందో రెండేండ్లకే ఈ బిడ్డల గూడు మీద ఆంధ్రోల్ల కన్నువడ్డది. మెల్లగమెల్లగ మొదలై మొత్తం ఈ జాగనే కబ్జచేసేదాకా నిద్రపోని వాళ్ల నైజం నన్ను దిగ్గున నిద్రలేపింది. తెలంగాణ బిడ్డల వీపు చరిచిన. ఉలిక్కిపడ్డరు. అప్పుడు మొదలైన నా సెగ ఇప్పటిదాకా సల్లారనే లేదు. 69లో మల్లా లేచినిలబడిన. అప్పుడు మీరే నన్ను బలంగా తయారు చేసినరు. కానీ అవతల పాలకులు నా కన్నా బలవంతులైనరు. నన్ను ఆవాహనం చేసుకుని బరిలోకి దిగిన పిలగాండ్లను పిట్టప్లూక్క కాల్చి నా రెక్కలు విరిచినరు. అప్పటికే రాజకీయాల్లో ఉన్న కొంతమంది నా బిడ్డలే నా వెన్ను విరిసినరు. నేలకొరిగిన. కానీ చావలే! నిస్సత్తువైన మాట నిజమే కానీ మరణశయ్య మీద మాత్రం లేను. ఇప్పుడు కూడా!

బలహీనం కాలే
తెలంగాణలో నా ఊపిరి అరవై ఏండ్లది. నన్ను మోసేటోళ్లు లేక నిద్రాణంగా ఉన్ననేమో గానీ నా శ్వాస ఏనాడూ బలహీనం కాలే. సాయుధనై రణభూమిలో లేకపోవచ్చునేమో కానీ...అక్షరాన్నై సారస్వతంతో ఆవేశాన్ని ఉసిగొల్పుతూనే ఉన్న. మీ పుట్టల్లోకి కాలకూట విషాన్ని చిమ్మే నాగులు చేరాయని రొదపెడ్తనే ఉన్న. నాటికీ...నేటికీ తరం మారింది. ఆలోచనలూ మారాయి. ప్రభుత్వాలూ మారాయి. మీడియా విస్తృతమైంది. నన్ను హింసకాసారంలా మారొద్దన్నరు. శాంతించమనే ప్రార్థించినరు. సరేనని నా గుణం కాని సహనాన్ని ఆపాదించుకున్న.

పాలకులు దానికి పరీక్ష పెడుతున్నరు. న్యాయానికి అండగా ఉండాల్సిన మీడియా కూడా రకరకాల కామెంట్లతో నన్ను అపహాస్యం చేస్తున్నది. ఆఖరుకు నన్ను ఒక వినోదంలా చూపిస్తున్నది. నన్ను హేళన చేయడం భరించలేని చాలామంది బిడ్డలు ఆత్మబలిదానాలర్పిస్తున్నరు. కానీ నేను కోరుకున్నది ఇది కాదు. మీ వెనక నేనున్నానంటే ఎట్లుండాలే..సింహాలై గర్జించాలే. కానీ నా బిడ్డలు సున్నిత మనస్కులు. అందుకే వాళ్ల వికృత చేష్టలకు గుండె జార విడుచుకుంటున్నరు. అయినా సర్కారులో చలనం లేదు. నన్ను తామే మోస్తున్నమనే భ్రమలో ఉన్న తెలంగాణ నేతల్లో కూడా చలనం లేదు. అయినా నేను ఓపికగా ఉన్న. అందరూ నన్ను అపార్థం చేసుకున్నరు. నాలో చేవ చచ్చిందని అనుకున్నరు. లాభంలేదనుకుని నేనేందో నిరూపించదలిచిన. నా చలనాన్ని చూపించడానికే ఈ రోజు ట్యాంక్‌బండ్‌ను వేదిక చేసుకున్న. గన్ పార్క్‌లో ఉన్న నా బిడ్డల వీర మరణ జ్ఞాపికను ఒకసారి స్పృశించి నా కదలికను చూపిస్త. శాంతిగానే! నన్ను విజయవంతం చేయాల్సిన బాధ్యత మీదే. నేనిప్పుడు మీ చేతుల్లోనే ఉన్న.

సాహసంతోనే సహవాసం
భయానికి నాకు ఎన్నడూ పొత్తు లేదు. జంకు ఉన్న చోట నేనసలు ఉండనే ఉండ. నాకు సాహసంతోనే సహవాసం. పౌరుషానికి మీరంతా పెట్టింది పేరు. నన్ను మోస్తున్న మీరంతా సాహసవంతులే! కాబట్టే 60 ఏండ్ల నుంచి మీ పంచనే ఉంటున్న. మీకు విజయం వరించేదాకా నిద్రపోను. నన్ను మీ నుంచి దూరం చేయడానికి సర్కారు రకరకాల జిత్తులు ప్లే చేస్తున్నది. నాతో చెలిమి చేసేటోళ్లను అరెస్ట్ చేస్తానని బెదిరించింది. నన్ను ఆలింగనం చేసుకున్న కొంతమందిని జైల్లో పెట్టింది కూడా. నన్ను వదిలేసి మీరు పారిపోవడానికి రబ్బరు బుల్లెట్టు, టియర్ గ్యాస్‌ను కూడా ప్రయోగిస్తది. గందరగోళ ప్రకటనలతో మిమ్మల్ని నిస్సహాయులను చేసి నన్ను అశక్తురాలిని చేయాలనుకుంటది.

ఒక్కమాట...
ఇప్పుడు మీరు ఏ మాత్రం వెనక్కి తగ్గినా నేను అచేతనమవడం ఖాయం. అది నాకు చావులాంటిదే. ఒక్కసారి మీ నుంచి నేను విడివడితే మళ్లీ మీతో జతకట్టే అవకాశం ఉండదు. మీ గూడు మీకు దక్కే ఛాన్సూ రాదు. ప్రపంచంలోని మిగతా చోట్ల నేను ఎలా ఉన్నా...ఇక్కడ నా స్వరూప, స్వభావాలు ప్రత్యేకం. లోకంలో నా ఊసే లేని సమయంలో కూడా మీ దగ్గర (60 ఏండ్ల నుంచి) నేను బలంగా ఉన్నా. కారణం...ఇక్కడ మీరు అనుభవిస్తున్న పరిస్థితులు. మీ తలరాతను మీరే మార్చుకోవాలి. వలస పాలకులు మార్చరు. బ్రిటిషర్స్ లాగా వాళ్లకు ఇక్కడ సంపదే కావాలి, మీ యోగక్షేమాలు కాదు. మీ అస్తిత్వం వాళ్లకు అనవసరం కాబట్టి అది లేకుండా చేయడానికే ప్రయత్నిస్తారు. మీ ఉనికి చాటుకోవడానికి ఈ కవాతు గొప్ప అవకాశం. సాగరంలా ట్యాంక్ బండ్‌ను పర్చుకోండి...నేను సజీవంగా ఉన్నానని చాటండి!

Wednesday, September 26, 2012

వారేవ జీవ వైవిద్యo

పిట్టలు పుట్టలు గుట్టలు ఎవరి కోసమట ?
మనిషే లేని చోట అవి ఎందుకంట ?

 

తెలంగాణ నిలువెత్తు సంతకం-కొండా లక్ష్మణ్ బాపూజీ

http://www.namasthetelangaana.com/Editpage/columnists/Allam-Narayana.asp?ContentId=155073
 
కోతపెట్టే శీతాకాలపు ఢిల్లీ చలి ఇంకా వణికిస్తూ ఉండగానే... జంతర్‌మంతర్‌లోని ఆ ముసలివాళ్ల శిబిరం బిలబిలా
నిండిపోయింది. బాపూ జీ కరస్పర్శ శీతలంగానే ఉన్నది. జీవం లేనట్టుగా ప్రారంభమైన ఆ శిబిరం కాసేపటికి మాటల మంటలతో వెలిగింది. తొంభై ఆరేళ్ల వయసులో కొండా లక్ష్మణ్ బాపూజీ జంతర్‌మంతర్‌లో వారంపైబడి చేసిన దీక్షల గురించి ఇది. ఆయనకు సంఘీభావంగా వెళ్లినప్పుడు ఈ కురువృద్ధునికి ఏదో శక్తి ఉంది అనిపించింది. గాంధేయవాదులంటే కొంత ఎడంగా అనిపించే తత్వంలోంచి, కాంగ్రెస్‌కు కొంచెం దగ్గరగా ఉండి, దీక్షలు, సత్యాక్షిగహాలు, సుతిమెత్తని ఆగ్రహాలతో తెలంగాణ సాధిస్తామని నమ్మే వాళ్లంటే కొంత అపనమ్మకంగా ఉన్నా బాపూజీతో మాత్రం అందరం కలిసి నడుస్తున్నట్టుగా అనిపించేది. మలి తెలంగాణ ఉద్యమం లో ఇద్దరు కురువృద్ధులు అట్లా ఆకర్షించారు. కాళోజీ మీద ప్రేమ వేరు. ఆయన ఇతరేతర మనసు కలిసిన గురువు. కానీ వరంగల్ భూపతి కృష్ణమూర్తి, హైదరాబాద్ కొండా లక్ష్మణ్ బాపూజీలు మలి తెలంగాణ ఉద్యమంలో ఒక అంతస్సూవూతంగా చేతులు కలిసిన, ఉద్దీపనలుగా అనిపించిన వాళ్లు. ఇప్పుడా కొండా లక్ష్మణ్ బాపూజీ లేరు. అంతస్సూవూతమేదో తెగిపోయినట్టుగా కోల్పోయినట్టుగా, లోటుగా ఉన్నది.ఆయన వృద్ధుడే. కానీ విద్యార్థి, యువజనులను నమ్మాడు. రాజకీయాలు భ్రష్టుపట్టడం ఎరుకతో ఆయన యువజనం మీద విశ్వాసం పెంచుకున్నాడు. బహుశా ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ అనుభవం. రాజకీయాల్లో, రాజకీయేతరంగా తెలంగాణ ఆకాంక్షకు సంబంధించి జరిగిన అన్ని పరిణామాల మీద అవగాహన ఆయన నిండు అనుభవాల సారంగా ఏర్పడిందే. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఆయన లోపలి మనిషి. అసహజ అభివృద్ధి, వలస ఆధిప త్యం తెలంగాణను ధ్వంసం చేసిన తీరును ఆయన జీవిత కాలమంతా అనుభవించి పలవరించినందు వల్లనే ఒక పట్టుదల, మొండితనం, అన్ని మార్గాల పట్ల సహిష్ణుత, భిన్న భావజాలాలు, కార్యాచరణలపట్ల ఓర్పు సమకూరి ఉంటాయి. ఆ రకంగా కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ నిలు సంతకం. తెలంగాణ చారివూతిక కారణాలు, ఇక్కడ జరిగిన పోరాటాలు, వాటిలో ప్రత్యక్ష భాగస్వామ్యం, పరిశీలన వల్ల కొండా లక్ష్మణ్ బాపూజీ రూపుదిద్దుకున్నాడు.నైజాం వ్యతిరేక పోరాటం, గాంధేయవాదం, నిరంకుశ నైజాంమీద సాయుధ చర్యలు, స్వాతంవూత్యానంతరం కూడా ఏ కలా నెరవేరని తనం, తెలంగాణ ప్రత్యక్షంగా పరాధీన కావడం, ఆయనను 1969లో మంత్రిగా రాజీనామాకు పురికొల్పిన అంశమైతే, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ప్రతిపక్షంగానే ఉండడం, మరే పదవి స్వీకరించకపోవడం ఆయన నిబద్ధ రాజకీయాలకు, నైతికత, మమేకత విలువలకు నిదర్శనం.

వాంకిడి లాంటి చిన్న ప్రాంతం నుంచి వచ్చి తొంభదారు సంవత్సరాలూ ఒకే చైతన్య క్రమంలో విలువలు కాపాడుకుంటూ ఒక మనిషి బ్రతకడం ఎట్లా సాధ్యమయింది. ఆ మనిషిలో ఆ విలువలు ఎట్లా రూపుదిద్దుకున్నాయి. తపాలా గుమా స్తా కావలసిన మనిషి న్యాయవాదియై, సైకిల్ మీద భువనగిరి వెళ్లి కేసులు వాదిం చి, గాంధీ ప్రభావానికి లోనైనా ఆయన ఉక్కు క్రమశిక్షణకు మూలం బహుశా హరిబౌలీలో ఆ కాలంలో ఉండిన రాజకీయ వాతావరణం, రహస్యంగా వ్యాపించిన నైజాం వ్యతిరేకత. ఆర్యసమాజ్ ప్రభావం. గణేష్ వ్యాయామశాల యవ్వన కసరత్తులు, యోగా ఆయనను కన్నుమూసేదాకా నిలబెట్టిన దారుఢ్యాలయి ఉంటాయి. కోఠి రెసిడెన్సీలో జెండా ఎగరేయించి ఉంటాయి. ఆంధ్రవూపదేశ్ విలీ నం చేదు అనుభవాలు, తెలంగాణ మొత్తంగా అప్పటి ప్రజాభివూపాయం, ఆయన చేత తెలంగాణపైన రాజకీయ డాక్యుమెంట్‌ను విడుదల చేయించింది. అది నైజాం వ్యతిరేక పోరాటంలో రూపొందిన చైతన్యానికి కొనసాగింపుగా 1969లో బాపూజీ రాజీనామా చేశారు. అదే కొనసాగింపుగా 1996లో పునఃవూపారంభమైన తెలంగాణ ఉద్యమంలో ఆయన నిటారుగా నిలబడ్డారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితకాలమంతా మూడు పోరాటాల గుండా మూడు దశల గుండా గడిచింది. నిజానికి స్వాతంవూత్యానంతర కాలంలో నెహ్రూ ప్రవచించిన ప్రకారంగానే, ఇప్పటికీ మన్‌మోహన్ ప్రవచిస్తున్నట్టుగానే పేదలు పేదలుగా మిగిలిపోవడం, స్వేచ్ఛా స్వాతంవూత్యాల మాట అట్లా ఉంచి, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగస్థలాలు కొందరికే చెందినవి కావడం కొండా లక్ష్మణ్ బాపూజీని కలచివేసింది. అందుకే ఆయన బలహీనవర్గాల ఉద్యమ నాయకుడు అయ్యారు. సాంప్రదాయ వ్యవసాయిక భారతదేశంలో వ్యవసాయం, చేతి వృత్తు ల జీవన గతులు ఛిద్రమైపోతున్న సమయాల్లో, ఆయన బలహీన వర్గాల పక్షాన పతాకం ఎత్తారు. ఆ తర్వాత తెలంగాణ పతాకమెత్తారు. దోపిడీ, పీడన, ఆధిప త్యం, వివక్షలు ప్రాంతీయ, సామాజిక అంతరాలు అనుభవించిన వాడు కనుకనే ఆయన జీవితం ఈ మూడు అంశాలను అల్లుకుని సాగింది. ఆ తత్వమే అన్నింటినీ ఒక అల్లికలో కూర్చింది.

ఒకానొక పొద్దున్నే ప్రఖ్యాత కవి ఎన్ గోపి ఫోన్. మన్‌మోహన్‌సింగ్ చిల్లర దుకాణాలను కుప్పకూల్చే ఎఫ్‌డీఐల ప్రకటన చేసి విదేశీ వాల్ మార్ట్‌లకు తలుపులు బార్లా తెరిచిన నాడు ‘నమస్తే తెలంగాణ’ పెట్టిన హెడ్‌లైన్ ‘చిల్లర దొంగలు’ చూసి ఉదయాన్నే పనిగట్టుకుని ఫోన్ చేశారాయన. మీ హెడింగ్ నాకు దుఃఖాన్ని తెప్పించింది అన్నారాయన. మా నాయన నెత్తిమీద బట్టల మూట పెట్టుకొని అమ్మేటోడు. సహకార సంఘాలతో అది కూలిపోయింది. అప్పుడు మా నాయన అన్నడని యాది తెచ్చుకున్నారు గోపి. ఇగ సహకారం నెత్తిమీద మామూటలను కూల్చివేసి బతుకు బర్‌బాద్ చేసింది’ అని.. అది ఆ తర్వాత కాలంలో మరింత ఎదిగింది. చిల్లర కిరణా దుకాణాలను సూపర్ బజార్‌లు మింగినట్టే. సూపర్ బజార్‌లను మాల్‌లు, బిగ్ బజార్‌లు మింగినట్టే, వీటిని రేపు ఎఫ్‌డీఐలు మింగుతాయి. అందుకే మీ హెడింగ్ నచ్చిందని గోపి అంటారు. సరిగ్గా అదే అంశం కొండా లక్ష్మణ్ బాపూజీని తన వృత్తికారుల వేపు, చేనేతన్నల వేపు నిలబెట్టింది. ఆయన సహకార సంఘాలు పెట్టారు. కానీ క్షుద్ర రాజకీయాలు, అధికార చట్టాలు దాన్ని నిర్వీర్యం చేశాయి. ‘హైకో’ను ‘ఆప్కోలో కలిపిన తర్వాత, మరమగ్గాలు, భారీ పెట్టుబడులు మిల్లుల పెత్తనాలు సిరిసిల్ల దీపమార్పి వేసింది. సాంప్రదాయ వృత్తులు కూలిపోయి సాలెల మగ్గం సడుగులిరిగిన ఈ క్రమమంతా కొండా లక్ష్మణ్ బాపూజీ బలహీన వర్గాల వేపు, వారి హక్కుల వేపు నిలబడేలా చేసింది. అర్థ వ్యవసాయం, చేతి వృత్తుల భారత దేశంలో వేగవంతంగా సంభవించిన అసహజ అభివృద్ధి పేరిట జరిగిన మార్పులు మెజారిటీ ప్రజలను అన్నానికి దూరం చేసిన ఈ క్రమం ఆయనను నేతన్నల వేపు నిలబడేలా చేసింది. భూదాన్‌పోచంపల్లిలో బాపూజీ కాంస్య విగ్రహాన్ని ఆయన చేతనే ఆవిష్కరించుకున్నారంటే నేతన్నల్లో ఆయ న ఎంత పాతుకుపోయిన ఏకైక దిక్కో అర్థం చేసుకోవచ్చు. అంతిమంగా కొండా లక్ష్మణ్ బాపూజీ పునాది రాయేసి నిలిపిన చేనేత భవనంలో దీర్ఘ నిద్రలో నిశ్చలంగా ఉన్నాడు. అది ఆయన కట్టించిన భవనమే. పద్మశాలి హాస్టల్ దిక్కు-దశ అన్నీ ఆయనే.

స్వాతంవూత్యానంతర రాజకీయాలు భ్రష్టుపట్టి పోవడం, క్రమక్షికమంగా సామాజిక, రాజకీయ విలువల పతనంలోనూ ఆయన నమ్మిన గాంధేయవాద విలువల కోసం నిలబడ్డాడు. బలహీన వర్గాల నాయకత్వం గానీ, బీసీ ఉద్యమాలు గానీ రిజర్వేషన్ల కోసం, రాజకీయ సాధికారత పేరిట కొందరు అందలాపూక్కే ప్రణాళికలు వేసుకుంటున్న ఇప్పటి నాయకత్వాలకు మొత్తంగా సామాజిక న్యాయం దృష్టిగానీ, బలహీన వర్గాల హక్కుల పట్ల దృష్టి కానీ కొరవడిన కాలం. కానీ కొండా లక్ష్మణ్ బాపూజీది ఈ అవగాహనలో లోతైన దృష్టి. వ్యవసాయాధారిత వృత్తులు, చేతి వృత్తులు అంతరించిపోతున్న క్రమంలో, జీవనోపాధి అవసరాలు హఠాత్తుగా కనుమరుగై ప్రత్యామ్నాయం లేక కోట్లాదిమంది ఉపాధి కోల్పోతున్న తరుణంలో ఆయన రాజకీయ పోరాటాల్లో అంతర్లీనంగా వృత్తులు బతకడం గురించి యోచన చేశారు. సహకార సంఘం ప్రణాళిక అందులో భాగమే. ఈ విశాల దృష్టి ఆయనకు గ్రామీణ భారత సామాజిక, ఆర్థిక, స్థితిగతులు, ఉత్పత్తి సంబంధాల తీరు, ఉత్పత్తి కులాల మనుగడకు సంబంధించిన సవాళ్ల నుంచి వచ్చి ఉంటాయి.
ఈ సమ్యక్ దృష్టి వల్లనే ఆయన నేత కార్మికులు, వ్యాపారులు యజమానులు వేరు వేరని, వృత్తి కార్మికులు బతకడానికి రాజకీయ పోరాటమే శరణ్యమని నమ్మినవారు. ఆయన అందుకే తెలంగాణ నినాదంతో సామాజికతను జోడించాడు. తెలంగాణ అంతిమ విముక్తి ఇక్కడి సబ్బండ కులాలకు న్యాయం జరిగి, వాటిని బతికించడంలో ఉందని ఆయన నమ్మాడు.

తెలంగాణ జర్నలిస్టు ఫోరమ్ వేదికలను పంచుకున్నప్పుడల్లా ఆయన ఐక్యత గురించి, ఐక్యతా సూత్రాల గురించి యువజన విద్యార్థి ఉద్యమాల గురించి మాట్లాడేవాడు. తెలంగాణకు జరిగిన ద్రోహాల గురించి మాట్లాడేవాడు. తెలంగాణ ఉద్యమం మళ్లీ మొదలయ్యాక ఏక సూత్రంగానే జరిగింది. భౌగోళిక తెలంగాణ, ప్రజాస్వామ్య తెలంగాణ లాంటి చర్చలు అనేకం జరిగినా ఎక్కడ పెద్దగా వైరుధ్య వాతావరణం లేదు. కానీ అది విస్తృత మవుతున్న కొద్దీ సామాజిక తెలంగాణలాంటి ఇతర డిమాండ్లు ముందుకు వచ్చాయి. మొత్తం ఉద్యమంలో ఒక కీలక సమస్య ఉద్యమ శక్తులు ఐక్యత ప్రదర్శించడం, రాజకీయ శక్తులు పూర్తి అనైక్యంగా ఉండడం అనేది ఆచరణలో తెలంగాణ కు అడ్డంకిగా మారింది. ప్రజలు ఐక్యంగా ఉన్నా రు. ఉద్యమ శక్తులు తమ తమ భిన్నాభివూపాయాలతో సహా ఐక్యత ప్రదర్శించారు. కానీ రాజకీ య పార్టీలు ఐక్యత ప్రదర్శించ లేకపోయాయి. ఇట్లాంటి పరిస్థితులను స్వయంగా చూసిన బాపూజీ విలువైన ఐక్యత సూత్రాన్ని ప్రతిపాదించారు. ముందు తెలంగాణ, తర్వాత రాజకీయ ప్రయోజనాలు అన్నది ఆయన సూత్రం. రాజకీ య ప్రక్రియతో ముడిపడి ఉన్న తెలంగాణ సమ స్య రాజకీయ శక్తుల ఐక్యత ద్వారా సాధ్యమవుతుందని ఆయన నమ్మారు. తెలంగాణ ఆకాంక్షను రాజకీయ ప్రయోజాల కోసం ఉపయోగించడం కాకుండా, రాజకీయ పార్టీలు శక్తియుక్తు లు, అన్నీ కూడా ముందు తెలంగాణ కల సాకారం కావడానికి ఉపయోగపడాలని బాపూజీ కోరుకున్నారు. అందుకే ఆయన తెలంగాణలోని అన్ని భావజాలా ల ఉద్యమాలకు, పార్టీలు, రాజకీయాలకు కేంద్రబిందువయ్యారు. తెలంగాణ ఐక్యతా చిహ్నం అయ్యారు. ఉద్యమంలో బయటి శక్తుల విమర్శలకు, లోపలి శక్తుల విమర్శలకు మధ్య తేడాను స్పష్టంగా పాటించారు. ఉద్యమ శక్తులు, పార్టీ లు తమనుతాము విమర్శించుకోకూడదని ఆయన కోరుకున్నారు. వర్తమా నంలో నడమంత్రపు సిరి తెచ్చిన రాజకీయ పతనానికి ఎదురుగా నిలబడి ప్రత్యా మ్నా య నైతికత విలువలను కాపాడుకున్న బాపూజీ ఇప్పుడిక మన మధ్య లేరు. మరి నాలుగు రోజుల్లో ఆయన పుట్టిన రోజు. తెలంగాణ ఐక్యతా చిహ్నం, తెలంగాణ పెద్ద దిక్కు, కొండంత అండ, తెలంగాణ చూడకుండానే కన్నుమూశారు. తెలంగాణ సాధించడమే కొండా లక్ష్మణ్ బాపూజీకి మనమిచ్చే అసలు నివాళి. అమర్హ్రే బాపూజీ.. అమర్ రహే.
-అల్లం నారాయణ

Thursday, September 20, 2012

జీవితమే లేని చోట వైవిద్యం ఎక్కడిది ?

బతుకు చిద్రమైన చోట జీవితం ఎక్కడిది ?

జీవితమే లేని చోట వైవిద్యం ఎక్కడిది ?

 

Saturday, September 15, 2012

అసలేం జరుగుతున్నది?

Namasthe Telangaana Published on 15 Sep-2012
 
 

Saturday, September 08, 2012

తటస్థులెవరు? తెలంగాణపై సీమాంధ్ర మీడియా మాయాజాలం

తటస్థులెవరు?
scales-copy
తెలంగాణపై సీమాంధ్ర మీడియా మాయాజాలం
http://www.namasthetelangaana.com/News/article.asp?category=1&subCategory=2&ContentId=149524

  తెలంగాణకు ఒకలా.. సీమాంవూధకు మరోలా
మధ్యస్తంగా హైదరాబాద్‌లో
వార్తారచనల్లో విచిత్ర వైరుధ్యాలు
సీమాంవూధలో కనిపించని తెలంగాణ ఘటనలు
ఇక్కడి సంచలనాలకూ అక్కడ చోటు లేదు
సమైక్యవాదానికే పెద్ద పీట
తెలంగాణ గోస పట్టని మీడియా
మాన్యుఫాక్షరింగ్ కన్సెంట్
కొత్త పుంతలు తొక్కుతున్న వివక్ష

(టీ మీడియా, విజయవాడ, హైదరాబాద్) :అవి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ వెళ్లే పత్రికలు. సమాచారం అనేది ఏ ప్రాంతానికైనా ఒకటే. సమస్యను సమస్యలా చూడటం, సమస్యను ప్రజలకు చూపించడం మీడియా ధర్మం. దీనికి ఆ పత్రికలు ఒప్పుకుంటాయి. పత్రికలకు ప్రాంతాలన్నీ సమానమేననీ చెబుతాయి. కానీ.. ఒక ప్రాంతం మాత్రం తక్కువ సమానం. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలూ తమకు ముఖ్యమేనని చెప్పుకుంటాయి. కానీ.. ఒక ప్రాంతం పట్ల మాత్రం ఉదాసీనత. వాటికి ఒక ప్రాంతంలోని సమస్యలే కనిపిస్తాయి.. వినిపిస్తాయి. అవే ప్రధాన వార్తలుగా పతాక శీర్షికలు ఎక్కుతాయి. కాదు.. కాదు ఎక్కిస్తారు. వాటినే పదే పదే మీడియాలో చూపిస్తారు. నిజం నిష్టూరంగానే ఉంటుంది. ఆ నిజం.. ఒక ప్రాంతం పట్ల నిర్లక్ష్యం. పట్టరానితనం. ఆ ప్రాంతపు అస్థిత్వ, ఆత్మగౌరవ పోరాటాలు ఆ పత్రికలకు ప్రధానాంశాలు కావు. ఆ ప్రాంతపు ఆవేదనలు ఆ పత్రికలకు అవసరం లేనివి. ఆ ప్రాంతం ఎదుర్కొంటున్న దగా.. వాటి దృష్టిలో అంత ప్రముఖంగా ప్రస్తావించాల్సినదేమీ కాదు. పత్రికలు అమ్ముకోడానికి ఆ మార్కెట్ కావాలి. కానీ.. ఆ ‘మ్కాట్’లో జరిగే పరిణామాలు మాత్రం అవసరం లేదు. ఇదీ సీమాంధ్ర గుత్త పెట్టుబడిదారీ రాజకీయ వర్గ దుర్గాదుల గుప్పిట్లో ఉన్న పత్రికలు తెలంగాణ ప్రాంతం పట్ల అనుసరిస్తున్న వైఖరి. సదరు పత్రికలు ప్రచురించే వార్తల్లో అంతర్లీనంగా దాగి ఉండే సత్యం. థాట్‌పోలీసింగ్ మాత్రమే కాదు.. ఇప్పుడు సీమాంధ్ర పత్రికల లక్ష్యం.. వార్తల మేనేజ్‌మెంట్. ’మాన్యుఫాక్షరింగ్ కన్సెంట్’. తాము తటస్థ వైఖరితో ఉంటామని చెప్పుకునే కొన్ని పత్రికలు.. నిజానికి పక్షపాతాన్నే అనుసరిస్తున్నాయన్నది వాస్తవం. ఒకప్పడు అన్ని ప్రాంతాలకూ ఒకే తరహా పేజీ వెళ్లే రోజుల నుంచి.. ప్రాంతాలకు అనుగుణంగా పేజీలు, మొదటి పేజీల తయారీగా మారి.. కాలక్షికమేణా ఒక ప్రాంత పాఠకులే లక్ష్యంగా తయారవుతున్న విషాదకర వాస్తవానికి ఈ కాలం సాక్షీభూతం.

కొన్ని నాలుగడుగులు ముందుకేసినవీ ఉన్నాయి. సీమాంవూధకు ఒక తరహా వార్తా రచన.. తెలంగాణ ప్రాంతానికి మరో తరహా వార్తా రచన. ఒకటి సాదాసీదాగా తేలిపోతే.. మరోటి వీరంగం వేస్తుంది. మరి హైదరాబాద్ నగరంలో అన్ని ప్రాంతాల వారూ ఉన్నారుగా.. కనుక నగరంలో సర్క్యులేట్ అయ్యే కాపీలకు విభిన్న తరహా వార్తా రచన. ఎటూ కాకుండా.. నొప్పించక తానొవ్వక! తెలంగాణ ప్రాంతంలోనే కాదు.. రాష్ట్రంలోనే ఒక మేధావిగా పేర్గాంచిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ చనిపోతే.. అనేకానేక తరహా వార్తా రచనలను రాష్ట్రం చూసిందని పలువురు గుర్తు చేస్తున్నారు. ఒక ప్రాంతంలో మొదటి పేజీలో వచ్చిన వార్త.. ప్రాంతం మారేసరికి.. లోపల ఎక్కడికో వెళ్లిపోయిన సందర్భం. ఒక ప్రాంతంలో పేజీ అంతా ఆక్రమించి వార్త.. మరో ప్రాంతంలో అప్రాధాన్యమైపోయిన వైచిత్రి. తెలంగాణ వెలుగుల స్థానమెక్కడని ప్రశ్నించిన ఆందోళనకారులు.. ట్యాంక్‌బండ్‌పై ‘ఆంధ్ర’ వెలుగుల విగ్రహాలపై దాడి చేస్తే.. ఒక ప్రాంతంలో వీరోచిత రచన.. మరో ప్రాంతంలో నిందాపూర్వక కథనం. తెలంగాణ కోసం చేసుకునే ఆత్మహత్యలకు పెద్ద అక్షరాలతో శీర్షికలు.. అవే వార్తలు సీమాంధ్ర ఎడిషన్లకు వస్తే.. ఎక్కడో సింగిల్ కాలం వార్తలు. కొన్నైతే కనిపించనే కనిపించని తెలంగాణ నేతలు అంటున్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు విద్యుత్ సౌధను ముట్టడిస్తే సీమాంధ్ర ప్రాంత ఎడషన్లలో అదో సింగిల్‌కాలం వార్త. రాష్ట్రంలో ఓ ప్రధాన రాజకీయ పార్టీ.. ఓ ప్రాంతంలోని ప్రధాన సమస్యపై చేసిన ఆందోళనకు ఇచ్చిన ప్రాధాన్యం అది. అదే సమయంలో తెలంగాణ వ్యతిరేకులు ఒక్కటైతే అది అత్యంత ప్రాముఖ్యం ఉన్న వార్తగా మారిపోతుంది. ఢిల్లీలో సీమాంధ్ర ఎంపీలు రాత్రుళ్లు డిన్నర్ల పేరుతో తెలంగాణను అడ్డుకునేందుకు కుతంవూతాలు నడిపితే సమైక్యాంధ్ర కోసం ఏకతాటిపైకి వచ్చారంటూ పెద్ద అక్షరాలతో మొదటిపేజీల్లో ఆక్రమిస్తాయి. రాష్ట్రంలో దాదాపు ఎక్కడా ఇంత తీవ్రతతో లేని ఫ్లోరైడ్ సమస్యపై బాధితులను స్పీకర్ నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో బృందం పరామర్శించింది. రాజకీయాలకు అతీతమైన ఈ వ్యవహారం మానవతావాదానికి సంబంధించినది. మంచిగా ఎదగాల్సిన పిల్లలు.. అష్టావక్షికలై భవితవ్యం ప్రశ్నార్థకమై నరకయాతన అనుభవిస్తున్నారు.

దానికి కారణం ఫ్లోరిన్ అత్యధికంగా ఉంటున్న నీరు. మానవత్వంతో స్పందించాల్సిన అంశమిది. కానీ.. నాదెండ్ల మనోహర్ బృందం పర్యటన సీమాంధ్ర ఎడిషన్లలో తగిన ప్రాధాన్యం పొందలేక పోయిందని అంటున్నారు. ఎలక్ట్రానిక్ మీడియాదీ ఈ విషయంలో అదే తీరు. టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలో దుర్గ గుడి వద్ద ఫ్లైవోవర్ కోసం ధర్నా చేస్తే.. దానికి ప్రతిగా ఫ్లైవోవర్ వద్దంటూ స్థానిక ఎంపీ లగడపాటి పోటీ ధర్నాకు దిగితే అది రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశంలా రంగుపులిమి.. రంగుల డబ్బాలు ఊదరగొట్టగా.. సీమాంధ్ర పత్రికలూ అంతకు మించిన వార్త లేదనుకున్నాయి. ఉదాహరణలు కోకొల్లలు. ఇప్పుడు ఇది కూడా పోయింది. తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన ఆ కొద్దిపాటి మినహాయింపులు కూడా మాయమైనట్లున్నాయంటున్నారు పరిశీలకులు. ఇప్పుడు సీమాంధ్ర ప్రాధాన్యమే తెలంగాణ ప్రాంతానికీ.. సీమాంధ్ర ఎడిషనే తెలంగాణకూ..

మెడికల్ కాలేజీల సీట్ల వ్యవహారమే చూద్దాం. సీమాంవూధలోని మూడు కాలేజీలకు (విశాఖ, విజయవాడ, కర్నూలు) అదనపు మెడికల్ సీట్లు వస్తే.. రాష్ట్రానికి 150 సీట్లు వచ్చాయని రాశాయేకానీ.. తెలంగాణలో అర్హత ఉన్న కాలేజీలకు సీట్లు పెరగకపోవడాన్ని కనీసంగానైనా ప్రస్తావించలేక పోయాయి. మెడికల్ సీట్ల విషయంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందని, సీమాంవూధలోని కాలేజీల్లోసైతం దాదాపు ఇవే చిన్నపాటిలోపాలున్నా.. వాటికి సీట్లు కేటాయించిన మెడికల్ కౌన్సిల్, తెలంగాణ ప్రాంతం పట్ల మాత్రం వివక్ష చూపిందని సూటిగా విమర్శ చేయలేకపోయిన వైనం. తెలంగాణకు జరిగిన అన్యాయం ప్రస్తావనార్హం కాదా? ఏమనాలె దీన్ని? సీట్లు రాకపోవడానికి ప్రభుత్వం అనుసరించిన నిర్లక్ష్య వైఖరిని కనీసంగా ఎత్తిచూపలేని తటస్థత. ప్రభుత్వం కొంచెం శ్రమించి, చొరవ చేస్తే తెలంగాణ ప్రాంతానికి అదనపు మెడికల్ సీట్లు వచ్చే అవకాశం ఉన్నా.. ఆ జాప్యాన్ని నిలదీయని తటస్థ వైఖరిని తెలంగాణవాదులు నిగ్గదీస్తున్నారు.

తెలంగాణ దాహార్తిని పణంగా పెట్టి.. కృష్ణా డెల్టాకు నీరిచ్చిన దారుణంలోనూ అదే ధోరణి. ఒకవైపు మా గొంతుపూండిపోతున్నాయి తండ్రీ.. అంటూ తెలంగాణ ప్రాంతం మొత్తకుంటున్నా పట్టించుకోని ప్రభుత్వం.. తన మానాన తాను నిబంధనలు, చట్టాలను ఉల్లంఘించి మరీ కృష్ణా డెల్టాకు నాగార్జున సాగర్ నీటిని దోచిపెడుతున్నా.. ఇది అన్యాయం అనడానికి అక్షరాలు కూర్చని తటస్థత. తెలంగాణ ప్రాంత నీటి హక్కును రక్షిస్తూ కృష్ణా డెల్టాకు సాగర్ నుంచి నీళ్లివ్వొద్దని రాష్ట్ర హైకోర్టు తీర్పు చెబితే.. అది లోపలి పేజీల్లో ఓ సింగిల్ కాలానికి పరిమితమైపోయిన పరిస్థితి. కృష్ణా డెల్టాకు 15 టీఎంసీల నీటి విడుదలకు ఉత్తర్వులు ఇస్తే.. అదేదో సంబరమన్నట్లు ప్రకటించిన సీమాంధ్ర పత్రికలు.. అదే ఉత్తర్వుతో కడుపు భగ్గున మండిన తెలంగాణ కష్టాన్ని మాత్రం పెద్దగా పట్టించుకున్నది లేదని ఇక్కడి ప్రజలు వాపోతున్నారు.
పక్కనే నదులున్నా.. పారే దిక్కులేక.. బోరుబావులపైనే ఆధారపడి వ్యవసాయం చేసుకోవాల్సిన స్థితిలో కీలకమైన కరెంటు కోతలతో తెలంగాణ రైతాంగం అల్లల్లాడినప్పుడూ సీమాంధ్ర పత్రికలుపట్టించుకున్న పాపాన పోలేదు. ఈ సమస్యపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దీక్షకు పూనుకుంటే ప్రభుత్వం ముందే అరెస్టులతో వాటిని సాగనీయలేదు. తెలంగాణ ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న సమస్యపై ఈ ప్రాంతానికి చెందిన వారిగా బాధ్యత కలిగిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దీక్షకు దిగే అర్హత లేదన్నట్లు ప్రభుత్వం వ్యవహరించింది. అదే సమయంలో రాష్ట్ర నేతలుగా చెలామణీ అవుతున్న సీమాంధ్ర ప్రాంత నేతలు తెలంగాణలో దీక్షలకు, యాత్రలకు, జైత్రయావూతలకు వస్తే.. అతిథి మర్యాదలు చేసి పంపిన పోలీసులు.. తెలంగాణ ప్రాంత నేతలు ఆందోళనకు దిగితే మాత్రం సహించకపోవటాన్ని ప్రస్తావించిన సీమాంధ్ర పత్రిక ఏదైనా ఉన్నదా? అని తెలంగాణవాదులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. సమస్యలే కాదు.. తెలంగాణ ప్రాంత రాజకీయ ఆందోళనలపైనా సీమాంధ్ర పత్రికలది అదే తీరని విమర్శిస్తున్నారు తెలంగాణ ప్రాంత విశ్లేషకులు. మొన్నటికి మొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలంగాణ ప్రజాపోరు యాత్ర పేరుతో తెలంగాణ జిల్లాలు చుట్టి.. హన్మకొండలో సభ పెట్టినా.. తెలంగాణ సాధన కోసం జాతీయ స్థాయిలో బీజేపీ ఢిల్లీలో దీక్షకు పూనినా తూతూ మంత్రపు కవరేజీ. ఢిల్లీలో తెలంగాణ మార్చ్‌పై వాటర్‌కానన్లు, లాఠీలు ప్రయోగిస్తే.. ఒక మూల చిన్న ఫొటో. కానీ సీమాంధ్ర ఎంపీలు ప్రధానిని కలిస్తే పతాకశీర్షికలే. ఇదీ సీమాంధ్ర పత్రికల ‘తటస్థ’ వైఖరి.? ఏమిటీ వివక్ష అన్నదే ఇప్పటి తెలంగాణవాదుల ప్రశ్న.

ఈ పరిస్థితి మారాలన్నదే సగటు తెలంగాణవాది ఆకాంక్ష. మా వార్తలు ఇతర ప్రాంతాలవారికి చూపకపోయినా ఫర్లేదు.. కనీసం మాకైనా చూపించండని వేడుకుంటున్నాడు సగటు తెలంగాణ పౌరుడు. ఇకనైనా సీమాంధ్ర మీడియా నైజం మారకపోతే.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతనైనా తెలంగాణ వార్తలు.. తెలంగాణ ఆవేదనలు.. ఇచ్చితీరాల్సి వస్తుందని గుర్తు చేస్తున్నారు తెలంగాణ ప్రాంత మేధావులు.. వాస్తవానికి రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోవడానికి ప్రజలు సముఖంగానే ఉన్నారు. విడిపోతే నష్టమేంటంటూ మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రజల ఆలోచనలను మీడియాలో ముద్రించని పత్రికలు, నేతల సమైక్య ప్రవచనాలను మాత్రం జిల్లా టాబ్లాయిడ్‌తో పాటు మెయిన్‌లోనూ రెండేసి చొప్పున ముద్రిస్తున్నాయి.
డెల్టాకు సాగునీటిని విడుదల చేయాలని టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమ జూన్ 28న రాత్రి పది మందితో కలిసి బ్యారేజీ దిగువన ధర్నాకు ఉపక్షికమిస్తే.. అదో పెద్ద సంచలనం. కానీ.. నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద నీటి విడుదలకు వ్యతిరేకంగా తెలంగాణవాదులు ఆందోళనకు దిగితే.. నింద మోపటం. డెల్టాకు సాగునీటి కోసం ఇటీవల ప్రకాశం బ్యారేజీ దిగువన లక్ష మందితో ధర్నా అని టీడీపీ ప్రచారం చేసుకుంది. లక్షలు కాదు కదా.. వేల సంఖ్యలో కూడా రైతులు రాలేదు. సుమారు రెండువేల కుర్చీలు వేస్తే.. అవి నిండటం కనాకష్టమైంది. అయినా.. అదో అద్భుత ఆందోళనగా ఎలక్ట్రానిక్ మీడియాలో ఊదరగొ ఆరోపణలున్నాయి.
నిజానికి ప్రకాశం బ్యారేజీ అసలు ఎత్తు కేవలం 12 అడుగులు మాత్రమే. ప్రకాశం బ్యారేజీ నిండా ఎప్పుడూ నీరు ఉంటుంది. బ్యారేజీలో 11 అడుగులు నీరు ఉంటే ఎన్టీపీకి విద్యుత్ ఉత్పత్తికి నీరు ఇచ్చే అవకాశం ఉంది. లేదంటే కాలువలకు ఏడు అడుగుల వరకు కూడా నీరు ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడి నేతలు మాత్రం ఎన్టీపీసీకి నీరు ఇవ్వాలి.. డెల్టాకూ పారించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నిండు కుండలా ఉండాలికానీ.. సాగర్ రిజర్వాయర్ కడుపు మాత్రం ఖాళీ అయిపోవాలన్నదే సీమాంధ్ర నేతల డిమాండ్. దీనికి మాత్రం సీమాంధ్ర మీడియా ఎక్కడలేని ప్రాధాన్యం ఇస్తుండటం విశేషం. సాగర్ రిజర్వాయర్‌ను ఖాళీ చేసైనా.. 440 అడుగుల వరకు నీరు ఉన్నా డెల్టాకు నీరు ఇవ్వాల్సిందే అంటూ మాజీ మంత్రి వడ్డే శోభనావూదీశ్వరరావు డిమాండ్ చేస్తే దానికి ఎక్కడలేని ప్రాముఖ్యం ఇచ్చే మీడియా.. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితులకు తాగటానికి మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదన్న వాస్తవాన్ని మాత్రం పట్టించుకోదు. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని నల్లగొండ, ఖమ్మం జిల్లా రైతాంగానికి ఖరీఫ్ సీజన్‌కు నీరు ఎందుకు ఇవ్వటం లేదని సీమాంధ్ర మీడియా ప్రశ్నించిన సందర్భాలను వెతుక్కోవాల్సిందే. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యంపై ప్రభుత్వాన్ని నిలదీస్తే పట్టించుకునే మీడియా.. నల్లగొండ జిల్లాలో ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు అతీగతీలేకుండా పడి ఉంటే.. కదిలిద్దామన్న స్పృహే కనిపించదు.
సీమాంవూధలో పట్టుమని పది మంది కూడా లేని సమైక్యాంధ్ర ఆందోళనలకు విపరీతమైన ప్రాచుర్యం కల్పించే మీడియా.. ఇదే ప్రాంతంలో జై ఆంధ్ర కోసం జరుగుతున్న ఉద్యమాన్ని చూడటానికి కూడా నిరాకరిస్తుండటం విశేషం. ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణవాదులందరూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్నారు. సీమాంవూధలో మాత్రం తొలుత జై ఆంధ్ర ఎగసిపడింది. ఆ తర్వాత అది సమైక్యాంవూధగా మారింది. కేవలం నేతలకు మాత్రమే పరిమితమైన ఈ పరిణామక్షికమానికి ఏమిటీ నేపథ్యం అన్న అంశంపై లోతులకు వెళ్లే ఆలోచనే చేయదు. గత మూడు నాలుగు దశాబ్దాలుగా జై ఆంధ్ర ఉద్యమాన్ని నడుపుతున్న వసంత నాగేశ్వరరావు వంటి ప్రముఖల వార్తలకు అసలు ప్రాధాన్యం ఉండదు. వేస్తే ఎక్కడో జోన్ పేజీలో. ఇదీ రాష్ట్రంలో ‘తటస్థ’ మీడియా అసలు స్వరూపం. పెట్టుబడిదారీ నేతల గుప్పిట్లో సాగుతున్న సమైక్యాంధ్ర సిద్ధాంతాలకు.. తెలంగాణ పట్ల గుడ్డి వ్యతిరేకతకు నిలయాలవుతున్న సీమాంధ్ర మీడియా స్వభావం. ఇదీ సంగతి.. ఇదం జగత్.. ఇలా ఉంది లోకం తీరు.