Sunday, October 16, 2011

తప్పు ప్రజాస్వామ్యానిదే-తప్పు గాంధీ దే

జనరల్ డయ్యర్ కుక్కలా మొరిగాడు అచ్చంగా. వేట కుక్కలా. నేనొక సిపాయిని. మీకు యుద్ధం కావాలా?
శాంతి కావాలా? ఒక వేళ మీరు యుద్ధాన్నే కోరుకుంటే ప్రభుత్వం తయారుగా ఉంది. మీరు శాంతి కావాలనుకుంటే నా ఆదేశాలు పాటించండి. మరో దారే లేదు. దుకాణాలు తెరవండి. లేదా కాల్చేస్తాను. ఫ్రాన్స్ అయినా అమృత్‌సర్ అయినా సైనికుడిట్లాగే ఉంటాడు. సైనిక భాష ఇట్లాగే ఉంటుంది. కానీ డయ్యర్ చరిత్ర కళంకమయ్యాడు. వేట కుక్కలా మొరిగిన వాడు ఊరకుక్కలా చచ్చిపోయాడు. అచ్చంగా కుక్క చావు. ఎనిమిదేళ్లకే . జలియన్‌వాలాబాగ్‌లో వందలమందిని పొట్టన బెట్టుకున్న ఎనిమిదేళ్లకే పక్షవాతంతో, మాటపడిపొయ్యి, బ్రెయిన్ హెమరేజ్‌తో, నరాలు చిట్లి డయ్యర్ కుక్కచావు చచ్చాడు.

జనరల్ డయ్యర్ కుక్కలా మొరిగాడు అచ్చంగా. వేట కుక్కలా. నేనొక సిపాయిని. మీకు యుద్ధం కావాలా? శాంతి కావాలా? ఒక వేళ మీరు యుద్ధాన్నే కోరుకుంటే ప్రభుత్వం తయారుగా ఉంది. మీరు శాంతి కావాలనుకుంటే నా ఆదేశాలు పాటించండి. మరో దారే లేదు. దుకాణాలు తెరవండి. లేదా కాల్చేస్తాను. ఫ్రాన్స్ అయినా అమృత్‌సర్ అయినా సైనికుడిట్లాగే ఉంటాడు. సైనిక భాష ఇట్లాగే ఉంటుంది. కానీ డయ్యర్ చరిత్ర కళంకమయ్యాడు. వేట కుక్కలా మొరిగిన వాడు ఊరకుక్కలా చచ్చిపోయాడు. అచ్చంగా కుక్క చావు. ఎనిమిదేళ్లకే . జలియన్‌వాలాబాగ్‌లో వందలమందిని పొట్టన బెట్టుకున్న ఎనిమిదేళ్లకే పక్షవాతంతో, మాటపడిపొయ్యి, బ్రెయిన్ హెమరేజ్‌తో , నరాలు చిట్లి డయ్యర్ కుక్కచావు చచ్చాడు. రవి గ్రుంకని సామ్రాజ్యమూ కుక్కలాగా తోక ముడిచింది. కానీ చరిత్ర మేల్కొంది. ప్రతి సందర్భం పొడవునా అది తేజోమయమయింది. డయ్యర్‌లు, హిట్లర్‌లు, ప్రజాసమూహాల అంతర్వేదనా భాషను అర్థం చేసుకోని వాళ్లు పెంటకుప్పల మీద స్థిరనివాసం ఏర్పరుచుకుంటారు. చివరికి గడ్డి పువ్వూ మొలవని విధంగా.కడుపునిండా నీళ్లున్న వాడిదీ అదే భాష. కోట్లమంది సమూహం పరివేదన వారికి అర్థం కాదు. కాల్చేయమన్న ప్రతివాడూ డయ్యర్ కాకపోవచ్చు. కానీ సైన్యాన్ని దింపమన్నవాడు, కనిపిస్తే కాల్చేయమన్నవాడు. కాల్చేసి చూపిస్తానన్నవాడు ఒకడే. సైనిక దుస్తులు లేని విద్వేషం. న్యాయంఒక వేపు ఉంటుంది. అసహనం ఒక వేపు మోహరించి ఉంటుంది. బిరడా తీస్తే బద్దలయ్యే లావా ప్రవాహం భంగపాటు ఒకవేపు నిలుచుని ఉంటుంది. కడుపు నిండినవాడు . కాలువల నిండా నీళ్లు నిండినవాడు. వాడి కాపలా కుక్కా ఒకే భాష మాట్లాడుతారు. ప్రజా సమూహాలకు విద్వేషం ఉండదు. భంగపాటు ఉంటుంది. చెప్పింది ఆచరించని వాళ్ల పైన అసహనం ఉంటుంది. అది ఇనుపకొలిమిలోంచి తీసిన ఇనుము తెట్టులాగా పేరుకుపోతూ ఉంటుంది దృఢంగా. రైల్ రోకో చేస్తే యావజ్జీవం ప్రకటిస్తుంది పోలీసు డ్రెస్సు. వలస పాలనలో ఒకటే భాష. అణచివేత అదొక నేరం అయినట్టు ..అది బ్రిటన్ కావొచ్చు. పొరుగువాడు కావొచ్చు. వలసాధిపత్యపు భాష. నిరంకుశ పదాలు . ప్రజాస్వామ్యాన్ని హననం చేసే ఎత్తులవి.. తాయెత్తులవి. మనసు విరిగినవాడు సమ్మె కడితే ఎట్లా కట్టాలోచెబుతుంది. చెదిరిపోయినవాడు ఏఏ సమ్మె చేయాలో భాషణాలు చెబుతుంది. బడి బంద్ పెట్టకూడదు. పిల్లల చదువులు పోతాయి. ఉపాధ్యాయులుసమ్మె చేయరాదు. ఉద్యోగులు సమ్మె చేయరాదు. సింగరేణి కార్మికులు అసలే సమ్మె చేయరాదు. కరెంటు పోతుంది. కారు చీకటి కమ్ముకుంటుంది. పొలాలు ఎండిపోతాయి. ఎట్లా? ఏం చెయ్యాలో చెప్పేవాడిదే ఆధిపత్యం. వాడు చెప్పినట్టు చెయ్యి. సమ్మె కూడా ఒకరి కనుసన్నల్లో నడవాలి. ఒకరు చెప్పిన పరిధుల్లోనే నడవాలి. అప్పుడే అది శంఖంలో పోసిన పవిత్ర సమ్మె. అది డయ్యర్ భాష. డయ్యర్‌ది అసహనం.

ముందు దుకాణాలు ఎందుకు బంద్ పెట్టారో ఆ కారణం గురించి డయ్యర్‌కు అవసరం కూడా లేదు. ప్రభుత్వానికీ అవసరం లేదు.అలనాడు 1919లో బైశాఖి ఉత్సవాల్లో గుమికూడారు వాళ్లు. ఒక సాంస్కృతిక ఉత్సవంలో అప్పుడు డయ్యర్ తుపాకీ మొరిగింది. గాంధీ మహాత్ముడే అయ్యాడు. శాంతిగా జరిగింది స్వాతంత్య పోరాటం. శాంతి కోసం కూడా. శాంతి కోసం యుద్ధాలు జరుగుతాయి. ఆ యుద్ధాన్ని సహించదు సైనికతత్వం. ప్రజాస్వామ్యం ముసుగుది. చెప్తుంది. చెయ్యదు. వాగ్దానం ఇస్తుంది. నిలుపుకోదు. మాటమీద నిలబడదు. ప్రజాస్వామ్యాన్ని జనసమూహం ఆచరిస్తుంటుంది. తనన్నమాటలను తనే మింగేసిన ప్రజాస్వామ్యంపై శాంతికోసం యుద్ధం జరుగుతూ ఉంటుంది. రాజ్యానికి అసహనం. రాజ్యానికి తుపాకీ ఉంటుంది. అచ్చం డయ్యర్‌లా మొరుగుతుంటుందది. సారాంశం ఇంతే. డిసెంబర్ 9 ఒక పచ్చి అబద్ధపు తేదీ అంటారు ఏలికలు. కాదు. దాన్ని జీవింపచేస్తాం అంటారు తెలంగాణ జనసమూహం. డిసెంబర్ 9 కొట్లాడి సాధించుకున్నం. ఉప్పిడి ఉపాసముండి గెలుచుకున్నం. ఉప్పెనై లేచి నిలబడి కలెబడి గెలుచుకున్నం. అది కాగితాలమీద పరుచుకున్న ఉత్త బోలు ప్రకటన కాదు. అందుకే అసహనానికి లోనవుతున్నది తెలంగాణ. అందుకే కుడుపులో సుమ్మర్లుచుట్టుకునే అలల సముద్రం లాంటి పోటెత్తే కన్నీళ్లనూ దాచుకున్నది తెలంగాణ. కన్నీటి కాసారం .అది ఉప్పెనవలె సకల జనుల సమ్మె కట్టింది. ఇప్పటిదాకా తనను తాను హింసించుకున్నది. సైనిక భాషకు, సైనికుడికి అర్థంగానిదేదో ఒకటి ఉండనే ఉంది. డిసెంబర్ 9 తర్వాత మంటల్లో మాడినవాడు. స్వచ్ఛందంగా రైలుకు ఎదురేగినవాడు. ఉరిపోసుకుని ఊపిరితీసుకున్నవాడు. రెండేళ్లుగా సాగుతున్నదిది. భంగపడ్డవాడిది కాదు విద్వేష భాష. ఏలికది. ముందు ఏం జరిగిందో? అక్కరలేని భాష. జీవితాంతం చీకటి కొట్లు ఉండవు. పరాధీనమైనవాడు, బానిసయినవాడు ఎప్పుడో ఒకప్పుడు స్పార్టకస్‌లా మల్లయుద్ధంలో శత్రు పసికట్టి ఉత్తచేతులతో మట్టికాళ్ల మహారాక్షసిని ఎదిరిస్తాడు. స్పార్టకస్ గోడు పట్టదు. తుపాకీ భాష మాట్లాడిన వాడే ఇప్పటి ప్రజాస్వామ్య పరిహాసకుడు. ఒక్కొక్కప్పుడు భ్రాంతీ వ్యాపిస్తుంది.

పన్నెండువేల కోట్ల రూపాయల కంపెనీ ఓనరు , సాధు జపం చేస్తాడు. ఎవరి దొర ఎవరో? నిర్ణయిస్తాడు. ఆచరించు. థాట్ పోలీసింగ్. గడీల కిప్పుడు పైడికంటె కాపలా. పెట్టుబడి క్రూరమైంది. భూస్వామ్యానికున్న పిసరంత నెనరు పెట్టుబడికి ఉండదు. అది నెత్తుటి పునాదులు తవ్వి మానవ రక్తమాంసాల,ఎముకల పోగుల మహాసౌధాల్ని కట్టింది. కాపోతే ప్రజాస్వామ్యంగా కనపడటానికి అది గడీలాగా మాట్లాడదు. భూస్వామ్యంలాగా మాట్లాడదు. నిజాం లాగా మాట్లాడదు. అచ్చం ఒక పెట్టుబడి దారుడి భాష నిన్ను సంస్కరించే ఏసుక్షికీస్తులా ఉంటుంది. పాలిష్డ్‌గా.అతనొక రక్షకుడు. నీ ముడ్డిబట్ట గురించి కూడా నీకు చెప్ప గలిగిన మర్యాద మప్పితపు భాష. నీ దొర గురించి వాడే మాట్లాడతాడు.అతనొక ప్రయోక్త.చితికిపోయిన భూస్వామ్యపు చితుకుల మంటను ఎగదోసి నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షకు ఎదురుగా నిలబెట్ట గలిగిన వాడే ఇవ్వాల్టి ప్రజాస్వామ్యవాది. ఆకాంక్షల కలలు ఫలిస్తున్నప్పుడు, కలలు సాకారమవుతున్నప్పుడు బీరువాల్లో మూలుగుతూ ముతక వాసనేసే డబ్బు సంచులు గుప్పించి టోకున ప్రజాస్వామ్యాన్ని కొనేవాడే నేటి పెట్టుబడిదారుడు. అప్పనంగా అప్పజెప్పిన సర్ఫెఖాస్‌లు, వక్ఫ్ భూములు, కంపెనీల మూలధనమై నిలిచిన రాజ్యం. అన్నీ వెరసి... పెట్టుబడినీతులు బోధిస్తుంది. కనుక అది భవిష్యత్‌ను ఆక్రమించుకునే కిరాతక హిట్లర్. నీతిని బోధిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని ఆచరించమంటుంది. ప్రజాస్వామ్యయుతంగా నిఖార్సయిన అహింసవాదంతో, శాంతిగాజరుగుతున్న ఉద్యమంమీదకు అది తుపాకీ తీస్తుంది. అప్పుడు మనం దిగ్భ్రాంతి చెందనక్కరలేదు. కానీ కొందరు ఆలస్యంగా అర్థం చేసుకుంటారు. ఈ యుగపు దొరపూవరో తెలుసుకునే సరికే నీతుల్లో పునీతమైపోతాడు పెట్టుబడిదారుడు.

అసలు శత్రువు కనబడడు. తెలంగాణ హంతకుల భాష ఇప్పటి పెట్టుబడిదారు భాష ఒక్కటే. హింస ... ఏది హింస ఎనిమిది వందల మంది ప్రాణాలు తీసిన భంగపాటు. మృత్యువు కమురు వాసనేస్తుంది. కనపడని హింస. ఆకాంక్షలు రేపినవాడు. ఓటుకోసం ఆశల దీపం వెలిగించిన వాడు. కోటను ముట్టడిస్తామన్నప్పుడు మోకరిల్లి ఆకాంక్ష ప్రకటించిన వాడు. కలను చిదిమి దీపం మలిపిన వాడు ఒకడేఅయినప్పటి ఆశాభంగం... ఎనిమిదివందల మందిని బలిగొన్న హింస. పెట్టుబడి కిరాతక ప్రకటనల కింద మూలుగుతున్న మిత్తి స్వరూపం. ప్రజాస్వామ్యం ఒక పరిహసించిన మైమరపు. ఎంతకూ తేలదు. ఎంతకూ కదలరు. ఏదీ మాట్లాడరు. ముప్పయి ఐదు రోజులు. ఎగదన్నుక వస్తుంది నాభిలోంచి దుఃఖం మాట్లాడ్తున్నప్పుడు అకారణంగా నిస్సహాయతలోంచి పొంగివచ్చే దుఃఖం. ఎసరు ఎక్కొచ్చినట్టు. పండుగ ల్లేవు. మా పిల్లలకు కొత్తబట్టలు లేవు. ఏడ్వు స్వామిగౌడ్, కానీ లొంగిపోకు. కరువుదీరా ఏడువు కానీ శాంతి కోసం పాతిన స్తంభంలా నిలబడు. కొన్ని అక్షరాలిస్తాను నీ కోసం. కొన్ని కన్నీళ్లూ ఇస్తాను. ఒక సింగరేణి కార్మికుని సెమ్మాసిస్తాను. జాడూ కొట్టే సఫాయి కార్మికుని చీపురుకట్ట ఇస్తాను. క్షురకుని కత్తెర ఇవ్వగలను. ఏమివ్వగలను. కోట్ల గొంతుల నినాదం ఇవ్వగలను. నిజమే మంత్రులు మోసమే చేస్తారు. నిజమే ఎమ్మెల్యేలూ మోసం చేస్తారు. అద్దాల బంగ్లాల్లో, కాంట్రాక్టుల్లో, ఒప్పందాల్లో, ఖజానాల్లో మూలుగుతున్న ముక్క వాసనేసే సిరి సంపదల్లో కూరుకుపోయారు వాళ్లు. ఒక రాజ్యమూ, దాని తుపాకీ, వారి తుపాకీని భుజాన మోసి, కుక్కలా, అచ్చంగా వేటకుక్కలా మొరిగే డయ్యర్‌లకు పుట్టుబానిసలు వాళ్లు. కానీ నిలబడ్డాం కదా మనమే.


మన తెలంగాణ మనకు కావాలని, పూర్తి ఐచ్ఛికంగా, పూర్తి స్వేచ్ఛ కోసం, పూర్తి స్వాతంత్య్రం కోసం, స్వచ్ఛందంగా నిలబడ్డాం. శాంతి కోసం యుద్ధంలో అశాంతి వల్లనూ, ప్రజాస్వామ్యం హంతకుల అవహేళనల వల్లనూ మరణించిన ఎనిమిది వందల మంది బలిదానాల పునాదుల మీదుగా వచ్చాం. అవును స్వామిగౌడ్ మీతో మేమూ ఉన్నాం. నిజమే కరుణగల, దయగల ప్రజాస్వామ్యంలో తెలంగాణ ఒక ఒంటరి సమాజం. గోడు చెప్పుకుంటే వినడానికి ఒక మనిషి, గోస పంచుకోవడానికి ఒక మనిషి, పోయి రావడానికి ఒక ఊరూ ఉండాలి. తెలంగాణకు ఇప్పుడు ఒక ఊరు లేదు. గోస చెప్పుకుంటే విని పరిష్కరించే మనిషీ లేడు.పోయి రావడానికి ఒక ప్రాంతమూ లేదు. ఒంటరిదై పోయింది తెలంగాణ .వినాల్సిన వారు వినరు. వారు బానిసలు. కనాల్సిన వారు కనరు. మూడుకోతులు వినవు. మాట్లాడవు. చూడవు. గాంధీ సమాధి వద్ద మౌనమే శరణ్యం. ఒక చెంపన కొడితే మరో చెంప చూపినప్పుడు మరో చెంపనూ కొట్టే ప్రజాస్వామ్య హంతకుల రాజ్యం. నిజమే . కానీ సకల జనులాలా! డయ్యర్ కుక్క చావే చస్తాడు. అతను చరిత్ర పెంటకుప్పల మీదే స్థిరనివాసి. చరిత్ర మాత్రం త్యాగాల పునాదుల మీద నిర్మితమౌతుంది. వర్తమానంలో మరింత వెలుగులాగా... పోరాటాల పునాదుల మీద చరిత్ర మారాకు తొడుగుతుంది. పరిపుష్టితోనూ, మరింత బలంగానూ.. తెలంగాణ మాత్రం మరణించదు. ఉద్యమమూ ఆగదు. అది నిజంగానే ఇప్పటికీ ప్రజాస్వామ్యాన్నే నమ్ముకున్నది.

చరిత్ర ముందున్నది కాలం ‘ ఇవన్నీ కాదు. చెప్పులు, బూట్లతో మొత్తం రాజకీయ నాయకులను కొట్టీ కోట్టీ చంపితేనే తెలంగాణ వస్తుంది’ - ఇది ఒక మహిళా ఉపాధ్యాయురాలి బహిరంగవూపకటన. బండారు దత్తావూతేయ సాక్షిగా... బహుశా శాంతికోసం జరిగే యుద్ధం ఇట్లాంటి మలుపు తీసుకుంటే తప్పు ప్రజాస్వామ్యానిదే. దాన్ని నమ్మిన వాళ్లది కాదు. తప్పు గాంధీ దే. ఆయనను నమ్ముకున్న శాంతియుత ఉద్యమానిది కాదు.
- అల్లం నారాయణ

Friday, October 14, 2011

Fight like there is no tomorrow-Define our tomorrow

I wouldn’t trade this for anything else. I am witnessing history unfold right before my eyes. I am happy that I am not living in another country like I was few years ago, then I would be so far away from the action. Of course I wish I was living in Telangana, instead of living in Bangalore. Every day I get up and feel bad that I am not living in Telangana. I wish I could be here all the time, right here, right now. But then I use every opportunity I get to visit Telangana to take part in the events unfolding in Telangana.
How could I miss this historic movement? It is like participating in our India’s freedom struggle against British. Imagine you were a young man during British India and you see people marching in protests. But imagine you were too lazy, or confused, or too ignorant, or gave some stupid reason not to participate in the freedom struggle. Would you not regret it now? I would.
I am thrilled to be part of the current agitation of Telangana. According to me, it’s once in a lifetime opportunity. Missing out is not an option for me. As an American would you not be thrilled to be part of your freedom struggle against British? Would you not give everything to be part of the struggle, participate in the raids of George Washington? As an African-American would you not be thrilled to be part of the crowd listening to Martin Luther King Jr’s I have a dream’ speech? [I am not African-American, but I would give everything to be part of that crowd on that historic day when he delivered that speech in Washington DC and I am quite sure I would be in tears]
As a Telangana person, this is your time. We didn’t have to fight British; we were emancipated by Indian police. Now is our chance to make our history, our freedom struggle, our independence movement, our chance to make the difference. It is our chance to be part of the George Washington’s raids and Martin Luther King’s speech.
This is history in making. We will look back at these days with great pride and great joy. The camaraderie we develop now will be for life long. Wouldn’t it be a wasted life if I have not stood up for something that concerned my people? What is the greatest struggle of mankind for? It’s not for money, not for power, not for luxury or comfort. The greatest of struggles of mankind has been for freedom, fighting for your people, for their rights and for their freedom?
So, what are you thinking? Why are so diffident? Why are you so timid? Will you forgive yourself apathy? Why are you confused? What will you tell your kids when they grow up? ‘I didn’t feel like participating in the greatest struggle that has happened in our history’? Wouldn’t you want to see in the mirror and tell yourself, ‘yes I stood for something that was grand, something more than myself and my immediate family, I stood for my people’?
Who cares how our current leaders are? Isn’t freedom more important than the kind of leaders we have? Right now, the time is not for hesitation. Not for doubt. Not for skepticism. Not for excuses. It is time for you to act. Otherwise you will never forgive yourself; you will have a hole in your heart that tells you that you didn’t do the right thing when you had a chance.
The hottest places in hell are reserved for those who in times of greatest moral crises maintain their neutrality – Dante
This is the greatest crisis that has befallen our people. This is the time to take a stand. Neutrality cannot be an excuse. So what are you going to do about it?
Many people say that students and the youth should concentrate on their academics and career and not participate in political fights. Those who say that have not read history. It is clear from our histories that greatest of the political movements that changed history of mankind involved heavy participation from the students. Those who were protesting for freedom in Tiananmen Square were students. Those who were protesting against Vietnam War in USA were students. Students and the youth have always been the section of society which has led the front in changing course of history. So, how could stop the students and youth of Telangana from participating in this historic and defining moment in our history?
Today, we are fighting for our identity, our share of water, our self-respect. Today, we fight against our suppressed history to compensate for all the times we were neglected, marginalized, and oppressed. Today, we fight against evils the beset our society, so that we can come out new from this struggle, cleaner and better. Today, we fight all the detractors and naysayers who said Telanganas don’t have it in them to create an identity for themselves. Today, we are united, in spite of all the differences amongst us. Today, we fight for a just cause, a cause which is much greater than each of us, and our selfish interest and our narrow perspectives. Today, we define a course of history for ourselves.
So, I urge you all Telangana people. It’s not the time for dillydallying or for hesitations. It is not the time to have self-doubt. It is not the time to give ignorance as an excuse. It is time for us to act. We owe this fight to our children and our grandchildren, so that they lead a life which is better than ours, where they hold their heads high because they are Telanganas, not to be ashamed of his identity, his accent or his language, but proud and confident. We owe it our progeny. We owe it to their future, their better life, and their self-respect.
So, I say to all of Telangana people, get off your ass and fight. Fight like there is no tomorrow. Only if you fight today in this historic fight, can you actually define your tomorrow. You have been given a chance to actually define your tomorrow. Don’t miss out on it.

Delhi nunchi DC dhaka

Delhi nunchi DC dhaka, DC ninchi Delhi dhaka dhoom dham chedham ,Thamasha supidham, Galli Galli thirugudham Lolli lolli Chedham

Friday, October 07, 2011

కూట్లె రాయి తీయలేనోడు ?

namasthe telangaana editorial 10/5/2011 11:31:52 PM
కూట్లె రాయి తీయలేనోడు ఏట్లె రాయి తీస్తనని పోయిండట! ఆంధ్ర ప్రదేశ్ సమస్యను పరిష్కరించుకోలేని ఆంధ్ర పెత్తందారులు ఇతర రాష్ట్రాల గురించి వినిపిస్తున్న వాదనలో పసలేదని బుధవారం నాడు ప్రణబ్ ముఖర్జీ మాటలతో స్పష్టమైపోయింది. కావూరి, లగడపాటి వంటి ఆంధ్ర పెత్తందారులు రాష్ట్ర విభజనను సాఫీగా సాగించలేక, దేశ వ్యాప్తంగా ఒక విధానం ఉండాలంటూ వితండ వాదన లేవనెత్తారు. కానీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ బుధవారం ఒక ఇంగ్లిష్ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేశ వ్యాప్తంగా రాష్ట్రాల ఏర్పాటుకు ఒక అనుసరించదగిన నమూనా అంటూ ఏదీ లేదని స్పష్టం చేశారు. కొన్ని వందలాది ఏళ్ళు పరిగణనలోకి తీసుకున్నా, భారత దేశంలో రాష్ట్రాల ఏర్పాటు ఏ ఒక్క నమూనా ప్రాతిపదికగా జరగలేదని ఆయన వివరించారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత బొంబాయి, మద్రాసు రాష్ట్రాల విభజనను ఆయన ఉదహరించారు.

రాజస్థాన్ అంశం ప్రస్తావించారు. అందుకే రాష్ట్రాల విభజన పరిస్థితులపై అంత లోతుగా వెళ్ళవలసిన అవసరం లేదని కూడా ప్రణబ్ వ్యాఖ్యానించారు. నిజానికి రాష్ట్రాల విభజనకు ఏ ఒక్క ప్రాతిపదిక ఉండదు. ఒక రాష్ట్రం ఏర్పడడానికి చారివూతక, భౌగోళిక, సామాజిక, ఆర్థిక, అస్తిత్వ పరమైన అనేకానేక అంశాలలో ఏవైనా దోహదం చేయవచ్చు. పైగా తెలంగాణ విషయంలో చారివూతకంగా రూపొందిన ఒక ఏకరూపత గల రాష్ట్రాన్ని హఠాత్తుగా ముక్కలు చేయమని కోరడం లేదు. ఎస్సార్సీ సూచనలకు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఆంధ్రతో విలీనం చేయడం వల్ల అనేక సమస్యలు వచ్చాయి. అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి. అందువల్ల విలీనమైన తెలంగాణను మళ్ళీ విడిగా రాష్ట్రంగా చేయాలనేదే ఇప్పుడున్న డిమాండ్. విలీనం విఫలమైందనడానికి తెలంగాణ ఉద్యమమే సాక్ష్యంగా కనిపిస్తున్నది.

ప్రణబ్ ఈ ఇంటర్వ్యూలో తెలంగాణకు సంబంధించి మరికొన్ని మాటలు కూడా చెప్పారు. అవి రివాజుగా అధిష్ఠానం ఎప్పుడూ చెప్పేవే. తెలంగాణ అంశం సున్నితమైనదీ, క్లిష్టమైనదీ అని, నిర్ణీత గడువులో పరిష్కారిస్తామని చెప్పలేమని ఆయన అన్నారు. తరువాత ఏర్పడే సమస్యల గురించి దూరదృష్టితో ఆలోచించాలని అన్నారు. అయితే ఈ పడికట్టు పదజాలాన్ని పట్టుకునే ఆంధ్ర మీడియా హడలగొట్టింది. మొదటి ఎస్సార్సీ తరువాతనే ఈసమస్యలు వచ్చాయని, మధ్యలో పెద్దమనుషుల ఒప్పందం, ఆరు సూత్రాల పథకం వంటివి కూడా ప్రస్తావించారు.

దేశమంతటికీ ఒక విధానం ఉండాలంటూ ఆంధ్ర పెత్తందారులు చేస్తున్న వాదనను ప్రణబ్ ఖండించిన అంశాన్ని ప్రస్తావించకుండా మొత్తం ఇంటర్వ్యూలో ఏ అంశం ఏ సందర్భంగా వచ్చిందో చెప్పకుండా, కేవలం ఆయన మాటల్లోని కొన్నింటిని ఉదహరిస్తూ ఆంధ్ర చానెళ్లు పదేపదే ప్రసారం చేశాయి. కొన్నేళ్ళుగా ఆంధ్ర చానెళ్లు చేసిన ఇటువంటి దుష్ర్పచారం మూలంగానే అనేక మంది తెలంగాణ బిడ్డలు నైరాశ్యానికి గురై బలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ పట్ల గుడ్డి వ్యతిరేకతతో ఈ చానళ్లు సున్నిత అంశాల పరిధి దాటి వ్యవహరిస్తున్నాయి. ఉద్వేగాలతో ఆడుకుంటున్నామన్న విషయాన్ని విస్మరిస్తున్నాయి. గత దశాబ్ద కాలాన్ని పరిగణనలోకి తీసుకున్నా, తెలంగాణ ఉద్యమం ఎంతో ముందుకు పోయింది. ఈ ముందడుగు ఆంధ్ర పత్రికలలో కానీ, టీవీ చానెళ్లలో కానీ ప్రతిబింబించక పోవడాన్ని బట్టి ఎంత పక్షపాత బుద్ధితో వ్యవహరిస్తున్నాయో తెలుస్తున్నది.
ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యలలో కూడా నిజాయితీ లోపించింది.

ప్రణబ్ ముఖర్జీ యుపిఎ ప్రభుత్వంలోనే సీనియర్ నాయకుడు. అనేక సమస్యల పరిష్కారంలో, సంక్షోభ పరిష్కారంలో గురుతర బాధ్యత పోషిస్తున్నారు. అటువంటి సీనియర్ నేత నోట తెలంగాణ సమస్య పరిష్కారంలో జరిగిన జాప్యం గురించి ఒక్క సంజాయిషీ కానీ, పశ్చాత్తాపం కానీ రాకపోవడం విచారకరం. 2004 ఎన్నికల తరువాత తెలంగాణ ఏర్పాటు చేస్తామని రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పిన నేపథ్యంలో ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఏర్పాటైంది. ఆనాటి నుంచి కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్ఠానం ఆంధ్ర పెట్టుబడిదారీవర్గం ఒత్తిడి మేరకు తెలంగాణ సమస్యను పరిష్కరించకుండా యధాతథ స్థితిని కాపాడుతున్నాయి. ఈ పాపంలో ప్రణబ్ ముఖర్జీకి కూడా పాలు ఉన్నది. ఇప్పుడిక తెలంగాణ ఉద్యమం ఉధృతమైన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం, కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని ఉపేక్షించలేని పరిస్థితి ఏర్పడింది. రోజు వారి ప్రాతిపదికన ఢిల్లీలో చర్చలు సాగుతున్నాయి.

కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ అంశాన్ని ఒక కొలిక్కి తేకుండా మొదటికి తెచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం పరిష్కార బాధ్యతను ప్రబణ్‌కు అప్పగించిందని అంటున్నారు. ప్రణబ్ త్వరలో హైదరాబాద్ వచ్చి వివిధ పార్టీలతో చర్చలు జరిపి వెళతారని తెలుస్తోంది. ఈ సందర్భంలో ప్రణబ్ వంటి సీనియర్ నాయకుడు తెలంగాణ వంటి సమస్యపై పడికట్టు పదజాలం వాడడం మాని, తమ తప్పిదాన్ని అంగీకరిస్తే ఎంతో హుందాగా ఉండేది. ఈ అంశంపై జరుగుతున్న కసరత్తును వివరించి, ఇక ముందు సాగదీయకుండా, అతి త్వరలో పరిష్కారం సాధిస్తామని ధీమాగా వివరించాల్సింది. ఇటువంటి ముదురు చర్మం నాయకులు ఉండడం వల్లనే దేశం ఈ విధంగా ప్రతి సమస్య రగులుతూ ఉన్నది. ప్రణబ్ ముఖర్జీ తన ఏకపక్ష ధోరణి వల్ల సంక్షోభ కారకుడవుతున్నడనేది ఇక్కడ గమనించాలె.

తెలంగాణ ప్రజలు ప్రణబ్ ముఖర్జీ సంక్షోభ పరిష్కార చాతుర్యం వల్లనో, ఆంధ్ర పెట్టుబడిదారీవర్గం దయాదాక్షిణ్యాల వల్లనో తమ రాష్ట్రాన్ని సాధించుకుంటామని ఏనాడూ వారిని ప్రాధేయపడ లేదు. తెలంగాణ జనానికి తమ శక్తిపైనే విశ్వాసం ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో తాము పడిన కష్టనష్టాలు వారిని ముందుకు నడిపిస్తున్నాయి. తెలంగాణ ప్రజలు ఐక్యంగా, ఉద్యమాన్ని ఉన్నత స్థాయికి తీసుకుపోయారు. సకల జనుల సమ్మె ప్రభావం వల్ల ఢిల్లీ పెద్దలలో కదలిక వచ్చింది. తెలంగాణ సాధించుకుని తీరవలసిందే. అప్పటి వరకు జనం విశ్రమించరు. ఉద్యమం ఆగేది లేదు.

Sunday, October 02, 2011

Vandhe Telangaanam

"I bow to thee, Telangaana"